Karthika Deepam 2 May 4th 2024 Episode: ఊరు వెళ్తున్న వాళ్లని వెనక్కి తీసుకొచ్చి బాధ్యత కూడా తీసుకున్నారంటగా? వెరీ గుడ్ అంటూ శ్రీధర్ కార్తీక్ ని వెటకారంగా కించపరుస్తాడు. నీకు ఉన్న పనులు చాలా అన్నట్టు ఇవన్నీ ఎందుకని కాంచన కూడా మాటకు మాట ఎక్కేస్తుంది. మానవత్వం కింద అలా చేశానని కార్తీక్ సమాధానం ఇస్తాడు. సుమిత్ర దీప మీద చాలా కోపంగా ఉంటుంది. నీకు ఎంత అన్యాయం జరిగితే నాకు ఎందుకు చెప్పలేదని తిట్టేలా? లేదంటే నేను నిన్ను కూతురిలా చూసుకుంటున్న నన్ను నువ్వు పరాయి దానిలా చూస్తున్నావని బాధపడాలా? అంటుంది. కావాలని చెప్పలేదని దీప అంటుంది. నన్ను వెనక్కి తీసుకురా పోయి ఉంటే ఈపాటికి మా ఇంట్లో ఉండేదాన్ని. నా పాత జీవితాన్ని మళ్లీ కొత్తగా మొదలు పెట్టేదాన్ని.
ఇక నా బిడ్డ గురించి తప్ప నా గురించి నాకు ఏ ధ్యాసలు లేవని దీప బాధపడుతుంది. సుమిత్ర నరసింహాని తిడుతుంది. నా కొడుకు మీకు కూడా తెలుసా అని అనసూయ అంటుంది. తెలుసు ఊరికి వెళ్లకపోతే చంపుతానని బెదిరించాడు. ఆ రోజే అడిగాను చెప్పి ఉంటే వాడి మీద పోలీస్ కేస్ పెట్టి జైల్లో కూర్చో పెట్టేదాన్ని. ఇప్పుడు మాత్రం వదులుతానని అనుకుంటున్నావా పోలీసులకు చెప్పి చీటింగ్ కేసు పెట్టి అరెస్ట్ చేపిస్తానని సుమిత్ర పంతంపై నిలబడుతుంది. అంత పని చేయొద్దని అనసూయ బాధపడుతుంది. పోలీస్ కేస్ పెడితే వీళ్ళ బ్రతుకులు వీధిన పడడం తప్ప ఏం ఉండదు. దీపకు న్యాయం నేను చేస్తాను. వాడి దగ్గరకు వెళ్లి రెండు చంపలు వాయించి బుద్ధి చెప్తానని అనసూయ నాచ చెబుతుంది. చెప్తే వినయ్ పరిస్థితిలో లేడని దీప అంటుంది.
వినకపోతే నేనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి నా కోడలికి అన్యాయం చేశాడని కేసు పెడతానని అనసూయ ఆవేశంగా మాట్లాడుతుంది. మీరు గట్టిగా నిలబడితే దీప జీవితానికి న్యాయం జరుగుతుందని సుమిత్ర చెబుతుంది. దీప నా కోడలే కాదు నా తమ్ముడి కూతురు కూడా. వాడే బతికి ఉంటే చూస్తూ ఊరుకుంటాడా? నేను అదే పని చేస్తానని అంటుంది. దీప కు నేనున్నానని సుమిత్ర ధైర్యం చెబుతుంది. శోభ నరసింహని మళ్లీ తిట్టడం మొదలు పెడుతుంది. దీపని పంపించిన తర్వాత ఏదైనా అంటూ తిడుతుంది. దీని నోరు మూయాలంటే దాన్ని ఊరు పంపించాలి. ఈరోజు దాని కథ ఏంటో తేల్చాలని అనుకుంటాడు నరసింహ. ఇక అప్పుడే దీప.. నరసింహ ఇంటికి రావడం చూస్తాడు. నీకు రెండు తగిలిస్తే నేనంటే భయం వస్తుందని అనుకుంటాడు.
దీప వస్తుంటే కర్ర పట్టుకుని రావే అని బెదిరిస్తాడు నరసింహ. వెనుక అనసూయ రావడం చూసి షాక్ అవుతాడు. అమ్మకి దొరికితే చచ్చానే అని ఇంట్లోకి పారిపోయి తలుపు వేసుకుంటాడు. అనసూయ ఒక దెబ్బతో డోర్ తీసేస్తుంది. కొట్టబోతుంటే కొట్టకు అని కాళ్లు పట్టుకుంటాడు నరసింహ. ఊర్లో అప్పులు చేసి వచ్చి ఇక్కడ అడ్డమైన వాళ్లతో కులుకుతున్నావా అని ఘోరంగా తిడుతుంది. ఎవరివే నోటికొచ్చినట్టు వాగుతున్నావని శోభ ఎదురు తిరుగుతుంది. మల్లె పందిరికి చీర కట్టినట్టు బాగానే ఉన్నావు రా అని తిడుతుంది. నీ మొగుడు నీ మాట వినడం లేదని అతని తీసుకొచ్చావా అని శోభ దీపని అంటుంది. నీ కొడుకు నాకు తాళి కట్టాడని శోభ చెబుతుంది. పెళ్లై కూతురు ఉన్న వాడిని పెళ్లి చేసుకోవడానికి సిగ్గు లేదా అని అనసూయ తిడుతుంది.
ఆ మాట అడగాల్సింది నన్ను కాదు నీ కొడుకుని… నాకు ఎన్ని అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకున్నావో చెప్పు అని శోభా తిరగబడుతుంది. నరసింహ నసుకుతుంటే శోభ హరిస్తుంది. నువ్వు లేకపోతే చస్తానని నీ కొడుకు నా వెంట పడ్డాడు. తల్లిదండ్రులు లేరు చచ్చారని చెప్పాడని అంటుంది శోభ. అప్పుల వాళ్ళని మాకు తగిలించి నువ్వు దీన్ని తగిలించుకున్నావా? ఇప్పుడు దీపకు ఏం సమాధానం చెప్తావని అనసూయ నిలదీస్తుంది. వద్దనే కదా వదిలేసి వచ్చానని చెబుతాడు నరసింహ. అంత ఇష్టం లేనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావ్? అని అంటుంది అనసూయ. నీ గోల పడలేక చేసుకున్న అని చెబుతాడు. దీప తప్పులు చేసింది అందుకే కాపురం చేయలేక వదిలేసాను. దీపం మంచిది కాదమ్మా. అది దర్జాగా ఇంకొకరితో తిరుగుతుంది. ఇలాంటి వాడిని చెప్పు తీసుకుని కొట్టాలని దీప తిడుతుంది.
నోటికి వచ్చినట్లు వాగితే నేను కొడతానని అంటుంది. నేను తప్పు చేశాను కాదనడం లేదు. రెండు మూడు నెలలలో ఊరు వచ్చి అప్పులు తీరుద్దామని అనుకున్నాను. జరిగింది చెప్పి ఊరు వెళ్లిపోదామని చేతులు పట్టుకుని బ్రతిమాలాను. నాతో గొడవ పెట్టుకుని వెళ్లిపోయింది. నాకు ఆ తర్వాత తెలిసింది దీప ఎవరో డబ్బున్న వాడి నీ తగులుకుందని. సంబంధం అంట గడితే చెప్పు తీసుకుని కొడతానని దీప తిడుతుంది. ఈ ఊర్లో బాగా డబ్బున్న వాడు ఉన్నాడు వాడితో కారులో తిరగడం నేను చూసానని అంటాడు నరసింహ. అనసూయ కార్తీక్ ని గుర్తు చేసుకుంటుంది. ఊరికి పోకుండా నీకు ఇవేం పనులు అంటే వాడితో నన్ను కొట్టించింది కావాలంటే అడుగు అంటాడు నరసింహ.
ఎందుకు కొట్టాడో నీ కొడుకుని అడగమని అంటుంది దీప. ఇదంతా ఇష్టం ఉండబట్టే కదా నన్ను కొట్టాడని అంటాడు. వాడు నా కొడుకుని కొట్టాడా లేదా అని అనసూయ అడిగితే కొట్టాడని దీప చెబుతుంది. ఊరు పోకుండా వాడి ఇంట్లోనే చేరింది. బాధగా ఉండి వెళ్లి ఊరి వెళ్ళమని అంటే అక్కడ కూడా ఒక పెద్దవిడితో నన్ను కొట్టించింది అని చెబుతాడు. జరిగింది ఇది అయితే నాకు ఏం చెప్పావు దాన్ని బెదిరించాలని కాకమ్మ కబుర్లు చెప్పావా అని శోభా తిడుతుంది. మా అమ్మ వీడితో పెళ్లి చేసి కోటి రూపాయలు ఇల్లు ఇచ్చింది. 10 లక్షలు పెట్టి టాక్సీ కూడా కొలిచ్చింది. 10 లక్షలు పెట్టి నగలు కూడా కొలిచ్చింది… అని శోభ అంటుంది. అనసూయ వెంటనే దాని దగ్గరకు వెళ్లి ప్రేమగా మాట్లాడుతుంది. అక్కడితో నేటి ఎపిసోడ్ కంప్లీట్ అయింది.