ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు ఇ-చలాన్లు జారీ చేస్తారు. అయితే కొంతమంది వాహనదారులు ఇ-చలాన్లను తీసుకుంటారు కాని జరిమానాలు చెల్లించట్లేదు. అయితే థానే పోలీసులు ఇ-చలాన్లు ఎవరైతే తీసుకొని జరిమానా చెల్లించట్లేదో వారి వాహనాలను స్వాధీనం చేసుకోనున్నారు. ప్రతి రోజు థానే పోలీసులు 2,500 మందికి పైగా ఇ-చలాన్లను జారీ చేస్తారు. ఈ చలాన్లలో సగానికి పైగా జరిమానా చెల్లించరని పోలీసులు తెలిపారు.
థానే ట్రాఫిక్ పోలీసులు ప్రతిరోజు 18 పోస్ట్ , 300 ఇ-చలాన్ పరికరాల ద్వారా ప్రతిరోజూ 2500 ఇ-చలాన్లు జారీ చేస్తారు.జరిమానాలు విధించినప్పటికీ వాహనదారులు పదేపదే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు పోలీసులు తెలిపారు. మహత్రాఫిక్ యాప్, వెబ్సైట్, పేటీఎం వంటి అనేక చెల్లింపు మార్గాలు సూచించిన కాని ప్రజలు జరిమానా చెల్లించడం లేదు. అయితే మొదట జరిమానా చెల్లించడానికి అందరికి 10 రోజులు సమయం ఇస్తారు. అప్పటికి చెల్లించకపోతే వారి వాహనాలను స్వాధీనం చేసుకుంటారు.ఈ కారణంగా ఈ విధమైన చర్య తీసుకోవడం జరిగింది. ఈ నిబంధన డిసెంబర్ 1 నుండి అమల్లోకి వస్తుంది.
థానే ట్రాఫిక్ పోలీసులు 2019 ఫిబ్రవరి 14 నుండి ఇ-చలాన్ జారీ చేస్తున్నారు. 2019 లో థానే పోలీసులు రూ. 21 కోట్లు జరిమానా విధించి 6,30,000 ఇ-చలాన్లను జారీ చేశారు. 2020 లో కరోనా లాక్ డౌన్ ఉన్నప్పటికీ 5,52,000 ఇ-చలాన్లకు రూ. 22 కోట్ల జరిమానా విధించారు. వీరిలో 50% కంటే ఎక్కువ మంది ఇ-చలాన్ జరిమానాలు చెల్లించలేదు. జరిమానాలు వసూలు చేయడానికి, పోలీసులు థానే, దొంబివాలి, కళ్యాణ్, బద్లాపూర్, ఉల్హాస్ నగర్ భివాండిలలో ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నారు.