ప్రముఖ రైడ్-హెయిలింగ్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రిటైలింగ్లోకి ప్రవేశిస్తోంది. పిటిఐ యొక్క నివేదిక ప్రకారం, వచ్చే ఏడాది జనవరి నాటికి ఓలా మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేయనుంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీని ప్రారంభించాలని ఓలా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతోంది.
2 మిలియన్ యూనిట్లకు పైగా ఉత్పత్తులు :
ఆమ్స్టర్డ్యామ్కి చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ “ఎటర్గో బివి” కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసినదే. ఈ కంపెనీ ద్వారా ఓలా తమ ఉత్పత్తులను నెదర్లాండ్స్లో తయారు చేసి భారతదేశానికి తీసుకురానుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంతో పాటు అనేక యూరోపియన్ మార్కెట్లలో కూడా అందుబాటులోకి రానుంది. దీని రూపకల్పన, ఇంజనీరింగ్ సామర్థ్యాలను పెంచింది. ఈ స్కూటర్లు అధిక సాంద్రత కలిగిన స్వాపబుల్ బ్యాటరీలతో తయారవుతాయి. ఒక ఛార్జింగ్ పై 240 కిలోమీటర్ల రేంజ్ని అందిస్తాయి. ప్రముఖ ఆటోమోటివ్ బ్రాండ్లైన టెస్లా, జనరల్ మోటార్స్, బిఎమ్డబ్ల్యూ, జాగ్వార్ మరియు ఫెరారీలతో కంపెనీ అభివృద్ధి అనుభవాలను కలిగి ఉంది. ఈ స్కూటర్లు ప్రవేశపెట్టడం ద్వారా దేశంలో 20 మిలియన్ యూనిట్ ద్విచక్ర వాహనలు మార్కెట్లోకి ప్రవేశిస్తాయని కంపెనీ భావిస్తోంది.మొదటి సంవత్సరంలో ఓలా మిలియన్ యూనిట్లకు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత మార్కెట్లో విక్రయించాలని ప్రణాళిక చేస్తుంది. అయితే భారత్ లో అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి ఓలా ఇప్పటికే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఒకసారి ప్లాంట్ను ఏర్పాటు చేసిన తర్వాత, దేశంలో సంవత్సరానికి 2 మిలియన్ యూనిట్లకు పైగా ఉత్పత్తులను తయారు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రత్యర్థిగా నిలవనుంది :
ముందుముందు భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ విభిన్నమైన అవకాశాలను కలిగి ఉంది. ఓలా తన అవకాశాలను విస్తరించడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటుంది. భారతదేశంలో ఇ-స్కూటర్లను అందించే ఈథర్ ఎనర్జీ, హీరో ఎలక్ట్రిక్, ఒకినావా, బజాజ్ ఆటో వంటి వాటికీ మంచి ప్రత్యర్థిగా చెప్పవచ్చు. లాభదాయకమైన ప్రోత్సాహకాలను అందించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా ప్రోత్సహించిన వ్యాపారంలోకి కంపెనీలు ప్రవేశించడానికి ఇది సరైన సమయం అనిపిస్తుంది. ఈ సదుపాయం 2 మిలియన్ యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ కేంద్రంగా ఏర్పాటవుతుంది .