Corona Vaccine: దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకి భారీగా పెరుగుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.. ఈ క్రమంలో దేశంలో 18 సంవత్సరాలు నిండిన వారందరికీ.. మే 1వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని రెండు రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే.. తాజాగా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది.. 18 సంవత్సరాలు నిండిన వారందరూ.. ఈ నెల 24 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని నేషనల్ హెల్త్ అధారిటీ సిఈఓ ఆర్ ఎస్ శర్మ గురువారం వెల్లడించారు..
18 ఏళ్లు పైబడిన వారందరూ కూడా కోవిడ్ విన్ యాప్ Cowin App ద్వారానే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఆర్ ఎస్ శర్మ సూచించారు.. వాక్సినేషన్ ప్రక్రియ, అవసరమైన డాక్యుమెంట్లు గతంలో మాదిరిగానే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి మరిన్ని ప్రభుత్వ కేంద్రాలను ఏర్పాటు చేశామని ప్రభుత్వ ఆసుపత్రుల సంఖ్యను కూడా పెంచినట్లు తెలిపారు.