AC Current Bill : వేసవి కాలం వచ్చేసింది.. ఇప్పటికే భానుడు భగ భగ మంటున్నాడు.. ఎండ వేడికి ఉపశమనం పొందడం కోసం ఏసి వాడటం తప్పనిసరైంది.. ఎండాకాలం లో రోజుల తరబడి ఏసీ వేసుకుంటే విద్యుత్ బిల్లు భారీగా వస్తుంది.. ఎక్కువ సేపు ఏసి వేసుకున్న విద్యుత్ బిల్లు పెరగకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి..
* ముందుగా ఏసి ని ఎలా వాడాలో తెలుసుకోవాలి. ఏసి వేసుకోవడానికి ముందు గది లో చల్లదనాన్ని గ్రహించే వస్తువులు లేకుండా చూసుకోవాలి. కిటికీలు మూసివేయాలి. ఎండ వేడి రూమ్ లోకి రాకుండా చూసుకోవాలి.
* ఏసీ వేయడానికి ముందు ఎక్కువ వేడిని వెలువరించే ఎలక్ట్రానిక్ వస్తువుల అయిన ఫ్రిడ్జ్, టీవీ , కంప్యూటర్ వంటివి ఆన్ లో లేకుండా చూసుకోవాలి. ఏసీ వేయడానికి ముందే వాటిని ఆఫ్ చేయాలి. కొంచెం సేపు చల్లబడిన తరువాత మళ్లీ వాటిని ఆన్ చేసుకోవచ్చు.
*రాత్రి సమయంలో రెండు గంటలు ఏసీని వేసుకోండి. తరువాత రూమ్ చల్లబడుతుంది. ఇక మరో రెండు మూడు గంటల పాటు ఏసి ని ఆఫ్ చేసి ఉంచండి. ఇలా చేయడం వల్ల విద్యుత్ ఆదా అవుతుంది.
*ముఖ్యంగా ఏసీ ఫిల్టర్ ను చెక్ చేసుకుంటూ ఉండాలి. దీంతో విద్యుత్ వినియోగం 5 నుంచి 15 శాతం తగ్గుతుంది. అంతేకాదు ఏసీ పనితీరు కూడా బాగుంటుంది. త్వరగా రిపేర్ రాకుండా కాపాడుతుంది.
* ఈ ఏడాది ప్రారంభంలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఏసీ తయారీదారులకు సూచన చేసింది.. తను ఏసీ పరికరాల తయారీ సమయంలో డిఫాల్ట్ ఉష్ణోగ్రతను 24 డిగ్రీలC వద్ద ఉంచాలని నిర్ణయించింది. దీనివలన ఏసీని ఎప్పుడు 24 నుంచి 26 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉంచితే రూ.300 వరకు కరెంటు బిల్లు తగ్గుతుంది. కాబట్టి వినియోగదారులంతా ఏసీ ని డిఫాల్ట్ ఉష్ణోగ్రతలో పెట్టుకుంటే 24 శాతం విద్యుత్తు ఆదా చేయవచ్చు. అంతేకాకుండా ఈ కరెంటు బిల్లులు కూడా తగ్గించుకోవచ్చు.