Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా హైలైట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఒకపక్క సంక్షేమం మరోపక్క అభివృద్ధిని సమపాళ్ళలో తీసుకెళ్లడానికి జగన్ చేస్తున్న కృషిని ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు అనుసరించే పరిస్థితి ప్రస్తుతం దేశంలో నెలకొంది. ముఖ్యమంత్రిగా అనుభవం లేకపోయినా రెండు సంవత్సరాల పరిపాలన కాలంలో జగన్ తీసుకున్న అనేక నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు చెందిన సీఎంలు తమ రాష్ట్రాలలో అమలు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ విధంగా పరిపాలన చేస్తున్న జగన్ సర్కార్ తాజాగా ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది.
మేటర్ లోకి వెళితే ప్రజా సమస్యలను పరిష్కరించడానికి జగన్ ముఖ్యమంత్రిగా తొలినాళ్ళలో స్పందన అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఎవరైనా ఈ స్పందన కార్యక్రమం ద్వారా తమ సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు రావటం మాత్రమే కాక అక్కడికక్కడే సమస్య పరిష్కారం అయ్యేలా అప్పట్లో జగన్ ఆలోచన చేయడం జరిగింది. కరోనా వైరస్ రావటంతో స్పందన కార్యక్రమం మొన్నటి వరకు నిలిచిపోయింది. ఇటువంటి తరుణంలో నేరుగా కలెక్టర్ దగ్గరికి ప్రజలు వెళ్ళకుండానే వారి సమస్యను స్పందన కొత్త పోర్టల్ ని ద్వారా తెలియజేసేందుకు సరికొత్త పోర్టల్ ప్రారంభించడం జరిగింది.
ఈ పోర్టల్ ద్వారా ప్రజలు తమ సమస్యలను నేరుగా ఫిర్యాదు చేసుకునే రీతిలో సిస్టం తీసుకొచ్చారు. దరఖాస్తు చేసిన వ్యక్తికి .. సమస్య పరిష్కారం అయ్యేలా చెప్పటం మాత్రమే కాక దరఖాస్తు ఏ స్థాయిలో ఉందన్న విషయాన్ని తెలుసుకునే రీతిలో పరిస్థితులు కల్పించారు. ఈ “స్పందన కొత్త పోర్టల్” విధానం ద్వారా .. ఫిర్యాదు పరిష్కారం కాకపోతే ఏ స్థాయిలో నిలిచిపోయింది అన్న విషయాన్ని కూడా ఫిర్యాదు దారుడికి తెలియజేసే విధంగా జగన్ సర్కార్ కొత్త పోర్టల్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో రాష్ట్రంలో ఎవరైనా ప్రజా సమస్యల విషయంలో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లకుండానే “స్పందన కొత్త పోర్టల్” విధానం ద్వారా ఫిర్యాదు చేసుకునే విధంగా వీలు కల్పించారు.