Covid 19 : దేశంలో కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. నిత్యం వేల సంఖ్యలో కేసు నమోదు అవుతున్నాయి. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 60 వేల కేసులకు పైగా నమోదు అయ్యాయి. ఇందులో సగం కేసులు మహారాష్ట్ర నుండి నమోదు అయ్యాయి. నాలుగు ఐదు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే అనేకమంది ప్రముఖులు, సెలబ్రిటీలు, మంత్రులు, పారిశ్రామికవేత్తలు రంగాల ప్రముఖులు కరోనా బారిన పడుతూనే ఉన్నారు.
తాజాగా క్రికెట్ దిగ్గజం భారతరత్న సచిన్ కరోన బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు కనపడగానే కరోనా టెస్ట్ చేయించుకో గా పాజిటివ్ నిర్ధారణ తెలిపారు. కుటుంబ సభ్యులందరికీ నెగిటివ్ రిపోర్టు వచ్చిందన్నారు. తాను హోమ్ క్వారంటైన్ దీంతో ఉన్నట్టు తెలిపారు.