లండన్ : మారుతున్న కాలంతో పాటుగా వాతావరణ పరిస్థితులు కూడా మరింత దారుణంగా మారిపోతున్నాయి. కొన్ని సంవత్సరాలైతే ఈ భూమిపై జీవం మనుగడ కూడా పూర్తిగా అంతరించి పోయే ప్రమాదాలు కూడా రావొచ్చేమోనని అనిపిస్తుంటుంది. దీనికి ఉదాహరణే క్రీ. పూర్వం ఉన్న జంతువులు ఇప్పుడు ఎక్కడా కనిపించవు. మరీ ముఖ్యంగా అడవులు అంతరించి పోతున్నాయి.
అడవులతో పాటుగా అరుదైన మొక్కలు కూడా కనుమరుగవుతున్నాయి. అంతరించి పోయిన జంతువులనైతే ఎలాగోలా మ్యూజియాలలో చిత్రాల రూపాల్లో చూసేయొచ్చు. కాని మొక్కలను మాత్రం ఎప్పటికీ చూడలేము.. కాని ఒక అరుదైన మొక్క మళ్లీ జీవం పోసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. 60 మిలియన్ ఏండ్ల కిందట ఉన్న మొక్క మళ్లీ కనిపించింది. ఈ మొక్క డైనోసార్ కాలంలో కనిపించింది. ఆ తరువాత దీని జాడే తేలిలేదట.
కాని అలా కనుమరుగైన ఈ మొక్క మళ్లీ దర్శనమిచ్చి పరిశోధకులను ఆశ్చర్యానికి గురి చేసింది. అది పెరగానికి ఇప్పుడున్న సానుకూల వాతావరణమే కారణమని శాస్త్రవేత్తలు వెళ్లడించారు. ఈ అరుదైన మొక్క లండన్ లో దర్శనిమిచ్చింది. దీనిపేరు సైకాడ్. సహజంగానే యునైటెడ్ కింగ్ డమ్ లో పెరిగిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
భూమిపై పెరిగిన ఉష్ణోగ్రత ఈ మొక్క జీవం పోసుకోవడానికి అనుకూలంగా మారిందని తెలిపారు. ఇదివరకు ఈ రకం మొక్క శిలాజాలను అలస్కా, అంటార్కిటికాలో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మొక్క ఆడ, మగ కోన్స్ ను కూడా ఉత్పత్తి చేస్తున్నదని శాస్త్రవేత్తలు తెలిపారు. దీని ద్వారా వాతావరణ పరిస్థితుల మూలంగా అన్ని ప్రతికూల పరిస్థితులే కాక ఇలా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని తెలిసింది.