ఆదివారం 16వ మ్యాచ్ లో అందరూ అనుకున్నట్టుగానే భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఢిల్లీ క్యాపిటల్స్ – కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన హై స్కోరింగ్ థ్రిల్లర్ లో ఢిల్లీ 18 తేడాతో విజయం సాధించింది. మొదటిగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ టీం ముందు నుండి దూకుడుగా ఆడింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 88 పరుగులతో నాటౌట్ గా నిలవగా పృథ్వీషా 66 పరుగులు, రిషబ్ పంత్ 38 పరుగులతో అతనికి సహకారం అందించారు. 26 పరుగులతో వేగంగా ఆడిన ధావన్ ఇన్నింగ్స్ ఆదిలోనే భారీ స్కోర్ కి రంగం సిద్ధం చేశాడు.
ఇక లక్ష్య ఛేదనలో కోల్ కత్తా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆశించినంత వేగంగా పరుగులు చేయలేకపోయారు. తర్వాత వచ్చిన నితీష్ రానా 58 పరుగులు చేసి పర్వాలేదనిపించినా అవసరమైనప్పుడు నింపాదిగా ఆడాడు. మోర్గాన్ 44 పరుగులు, రాహుల్ త్రిపాఠి 36 పరుగులతో లక్ష్య ఛేదన చేసేందుకు చాలా కష్టపడ్డారు. అయితే సాధించాల్సిన లక్ష్యం కొండంత ఉండడంతో వీరు కూడా ఏమీ చేయలేకపోయారు.
మొదటి నుండే ఢిల్లీ దూకుడుగా ఆడడం మొదలుపెట్టింది. చివర్లో అయ్యర్, పంత్ చివరి ఆకాశమే హద్దుగా చెలరేగగా ముందు 200 పరుగులు దాటుతుందని అందరూ ఊహించారు. కానీ అయ్యర్ మరింతగా చెలరేగడంతో ఢిల్లీ 228 పరుగులును 20 ఓవర్లలో స్కోర్ చేసింది. ఒకానొక దశలో ఢిల్లీ 250 పరుగుల వైపు పరిగెడుతుంటే ఆండ్రీ రస్సెల్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో వారి జోరు కు అడ్డుకట్ట వేశాడు.
ఇక చేజింగ్ లో కోల్ కతా టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ మిడిల్ ఆర్డర్ పై ఎక్కువగా ఒత్తిడి పెంచేశారు. రానా పవర్ ప్లే లో బాగా బ్యాటింగ్ చేశాడు కానీ తెలివిగా బౌలర్లు మార్చిన శ్రేయస్ అయ్యర్.. విధ్వంసకర రస్సెల్ రావడంతోనే తన స్టార్ పేసర్ కగిసో రబాడ ను రంగంలోకి దించి అతను వికెట్ తీయడంతో కో కతా మ్యాచ్ పై సగం ఆశలు వదులుకుంది. ఐతే ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, రాహుల్ త్రిపాఠి మెరుపులతో ఒక్కసారిగా మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా మారింది. కానీ చివరి రెండు ఓవర్లలో ఢిల్లీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కేకేఆర్ కు ఓటమి తప్పలేదు.