ఒకప్పుడు ఇండస్ట్రీ లో మంచి కమెడియన్లుగా పేరొందిన వేణు, ధనరాజ్ నెమ్మదిగా తమ ఉనికిని కోల్పోయారు. జబర్దస్త్ షో తో చాలా మంచి పేరు తెచ్చుకున్న వీరిద్దరూ ఎక్కడైనా కలిశారు అంటే అక్కడ ఏదైనా వివాదం చెలరేగవలసిందే. ఇక వీరిద్దరి కామెడీ తో షో లు చేసే పద్ధతి పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. బృందావనం ఆడియో ఫంక్షన్ లో వీరిద్దరు కలిసి చేసిన కామెడీ వర్కవుట్ కావడంతో అసలు జబర్దస్త్ కాన్సెప్టు వచ్చిందని బీజం పడిందని వారు చెప్పుకొచ్చారు.
ఇక బుల్లితెరపై వీరి ప్రయాణం అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది. ఇదే సమయంలో ఇప్పుడు వీరిద్దరు జీ తెలుగులో వస్తున్న ‘బొమ్మ అదిరింది’ షోలో కంటెస్టెంట్లు గా ఉన్నారు. అదిరింది షో లో భారీ మార్పులు సంభవించాయి అన్న విషయం తెలిసిందే. యాంకర్లను తీసేసి కొత్త యాంకర్ కూడా మార్చేశారు రవి,భాను శ్రీ స్థానంలో శ్రీముఖి వచ్చింది. ఇలా భారీ మార్పులు సంభవించిన ఈ షో పైన వేణు-ధనరాజ్ ఒక స్కిట్ చేశారు.
ఇందులో ధన్ రాజు ఒక రిపోర్టర్ గా మరి జానీ మాస్టర్ దగ్గరకు వెళ్ళాడు. అదే సమయంలో వేణు న్యూస్ ప్రజెంటర్ గా ఉన్నాడు. ఇక ధనరాజ్ జానీ దగ్గరికి వెళ్లి మీరు మాస్టరా? అని అడుగుతాడు…. డాన్స్ మాస్టర్ అంటే మీరు ఏం చేస్తారు అంటూ మరో కౌంటర్ వేసాడు. డాన్స్ మాస్టర్ ని మీరు ఏం చేస్తారు అని అడగడం నిజంగా అవమానమైనదే నెటిజన్లు ఫీలవుతున్నారు.
ఓహో మీరు అన్నీ పాటలకి డ్యాన్స్ చేస్తారా అని అడిగి స్టేజిపైకి జానీ మాస్టర్ తీసుకొచ్చాడు. చాలా ఊపు మీద వచ్చిన మాస్టర్ స్టెప్పులు వేసేందుకు రెడీ అవుతున్న సమయంలో కరోనా రింగ్ టోన్ ప్లే చేసి మళ్లీ అవమానించారు. ఇలా మాస్టర్ పై సెటైర్లు వేసి చాలా దారుణంగా అవమానించేశారు. ప్రోమోనే ఇలా ఉందంటే పూర్తి ఎపిసోడ్ లో జానీ మాస్టర్ ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.