Nalgonda District: కరోనా వైరస్ ప్రతి ఒక్కరిని భయాందోళనలకు గురి చేస్తోంది.. కరోనా రాకుండా కొంత మంది జాగ్రత్తలు తీసుకుంటే.. వచ్చినవారు తమ కుటుంబ సభ్యులకు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ఇలాంటి వారిలో ఈ వ్యక్తి ఎంతో ప్రత్యేకం.. రమావత్ సవా కి కరోనా సోకడంతో ఏకంగా చెట్టుపైనే మంచం కట్టుకొని నివాసం ఏర్పాటు చేసుకున్నాడు..
నల్గొండ జిల్లా, అడవిదేవులపల్లి మండలం, కొత్త నందికొండ గ్రామానికి చెందిన రామావత్ శివ హైదరాబాదులో బిటెక్ చదువుతున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఇంటికి వచ్చాడు. స్థానికంగా నిర్వహిస్తున్న ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో హమాలిగా పని చేసేందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో శివకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో.. కరోనా పరీక్షలు చేయించుకోగి పాజిటివ్ గా నిర్ధారణ అయింది..
అయితే ఇంట్లో ఒక గది మాత్రమే ఉండడంతో.. తన కుటుంబ సభ్యులకు కరోనా సోకుతుందనే ఉద్దేశంతో చెట్టుపైన మంచాన్ని తాళ్లతో కట్టుకొని.. అక్కడే 11 రోజులుగా నివాసం ఉంటున్నాడు.. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఆహారం, నీళ్లను తాడు సహాయంతో పైకి తీసుకుంటున్నాడు. ఇది చూసిన గ్రామస్తులు అతని సమయస్ఫూర్తిని మెచ్చుకుంటూ, మరోవైపు జాలి పడుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి గ్రామపంచాయతీలో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో బాధితులకు కావలసిన వసతులు కల్పించాలని కోరుతున్నారు.