Rahul Gandhi: కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాలుస్తుంది.. దేశంలో పలువురు ప్రముఖులు సెలబ్రిటీలు మహమ్మారి మారిన పడుతున్నారు.. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. కరోనా మరణాల సంఖ్య దేశ ప్రజలతో పాటు ప్రపంచ దేశాలను కలవర పెడుతున్నాయి.. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు..
స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో covid 19 పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారని రాహుల్ గాంధీ తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను నేరుగా కలుసుకున్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించారు.. నిన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం మహమ్మారి బారిన పడ్డారు. మరుసటి రోజే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి covid 19 పాజిటివ్ వార్త బయటకి రావడంతో కాంగ్రెస్ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది.
After experiencing mild symptoms, I’ve just tested positive for COVID.
All those who’ve been in contact with me recently, please follow all safety protocols and stay safe.
— Rahul Gandhi (@RahulGandhi) April 20, 2021