Social Distance: ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు.. అంతేకాకుండా వినూత్న ఆవిష్కరణలు చేసిన వ్యక్తులను సోషల్ మీడియా ద్వారా అభినందిస్తూ ఉంటారు.. తనకు నచ్చిన పోస్టులను ట్వీట్ చేస్తూ ఉంటారు.. తాజాగా మహీంద్రా ఓ వినూత్న ఆవిష్కరణ పై ట్వీట్ చేశారు..!!
అసలే ఇవి కరోనా రోజులు.. మాస్కులు ధరించడం, సామాజిక దూరం తప్పనిసరి అయింది. అయితే ఓ ఇద్దరు వ్యక్తులు మరో రకంగా సామాజిక దూరం పాటిస్తున్న ఫోటో షేర్ చేశారు.. ఇద్దరు వ్యక్తులు నిచ్చెన ను తమ మొడలకు వేసుకుని రెండు బైక్ లపై వెళ్ళే ఇద్దరు వ్యక్తులు ఉన్న ఫోటోను షేర్ చేశారు.. ఈ కరోనా కల్లోలంలోనూ ఈ ఫోటో నాకు నవ్వు తెప్పించిందని.. అయితే ఈ ఇద్దరు వ్యక్తులు మరోరకం సామాజిక దూరం పాటించారని.. ఇలా చేయడం ప్రమాదకరమైందని.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు..
Brought a smile to my face even in these trying times…Some social distancing techniques may be more hazardous than protective… pic.twitter.com/tDgNXcUBKR
— anand mahindra (@anandmahindra) April 30, 2021