Naga Panchami: ఖరాలి అర్థమైంది గరుడ రాజా ఆ పంచమికి దైవ శక్తి తోడుగా ఉంది అందుకే మనము తనని ఏమీ చేయలేకపోతున్నాను సరే ఏం చేయాలో నేను తర్వాత ఆలోచించి చెబుతాను అప్పటి వరకు నువ్వు విశ్రాంతి తీసుకోపో గరుడ రాజా అంటుంది ఖరాలి.గరుడ రాజు అలాగే కరాలి నీకు ఎప్పుడు అవసరం పడితే అప్పుడు పిలువు అంటాడు గరుడ రాజు. ఖరాలి మనసులో ఇలా అనుకుంటుంది ఈ గరుడ రాజును నా గుప్పిట్లు పెట్టుకొని అవసరం ఉన్నప్పుడల్లా నా పని చేయించుకొని తీరాలి అంటే గరుడ రాజును శాశ్వతంగా నాలోనే ఉంచుకోవాలి అంటే అది ఎలా సాధ్యం అని ఆలోచిస్తూ గరుడ రాజు శాశ్వతంగా నా దగ్గరే ఉండిపోవాలి అంటే తను మానవ రూపంలో జన్మించాలి అప్పుడే గరుడ శక్తి శాశ్వతంగా నా దగ్గరే ఉండిపోతుంది అనే ఆలోచించిన ఖరాలి గరుడ రాజుని ఎలాగైనా జ్వాల కడుపులో పుట్టేలా చేయాలి అని అనుకుంటుంది ఖరాలి.
కట్ చేస్తే మోక్ష తనుకు తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళతాడు డాక్టర్ అంతకుముందు పంచమిని టెస్టులు చేసిన వాటి గురించి మోక్షకు ఇలా చెబుతాడు చూడు మోక్ష నీ భార్య కడుపులో పెరుగుతున్న పిండంలో విషముందని తేలిపోయింది ఇక ఆ బిడ్డ భూమి మీదికి వచ్చిన తర్వాత కూడా తనలో విషం ఉంటుంది ఇది మాత్రం నిజం నేను నిన్ననే బాగా మనకు తెలిసిన అమెరికా ప్రొఫెసర్ ని కలిసి ఇదంతా టెస్టులు చేసి మాట్లాడాను అతను కూడా ఇదే చెప్పాడు కానీ నీ భార్య గురించి లోకానికి తెలిస్తే లోకమంతా నీ భార్యకు పూజలు పునస్కారాలు చేస్తారేమో అంటాడు డాక్టర్.మోక్ష నాకు అలాంటివి వద్దు డాక్టర్ గారు ఇవన్నీ బయటపడకూడదనే నేను మీ దగ్గరికి వచ్చాను అంటాడు మోక్ష.డాక్టర్ రేపు మీకు పుట్టబోతున్న ఆ బిడ్డ గురించి ఎవరికైనా తెలిసింది అనుకో జనం మాత్రం అదే పని చేస్తారు పాములు మనుషుల్లాగా మనుషులు పాములు లాగా మారుతున్నారు అని ప్రపంచానికి తెలిస్తే అందరూ కచ్చితంగా ఇదే పని చేస్తారు అని అంటాడు డాక్టర్. మోక్ష వద్దు డాక్టర్ గారు ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అనే నేను మీ దాకా వచ్చానని చెప్పాను కదా కాబట్టి ఇక ముందు ముందు కూడా ఈ విషయం బయటికి తెలియకూడదు అంటాడు. డాక్టర్ గారు లేదు మోక్ష ఇది నాకు తప్ప అలాగే అమెరికా ప్రొఫెసర్ కు తప్ప ఎవరికి తెలియదు నువ్వు ఇక ఏం టెన్షన్ పెట్టుకోకు వెళ్ళు అంటాడు. మోక్ష అక్కడి నుండి ఇంటికి వెళ్లి పోతాడు.
కట్ చేస్తే చిత్ర మీటింగ్ ఏర్పాటు చేస్తుంది అందరికీ కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. జ్వాల ఏంటి చిత్ర ఈ మీటింగ్ ఎందుకు పెట్టావు అని అడుగుతుంది.చిత్ర చెబుతాను అక్క ఇప్పుడు ఆ పాముల పిల్ల ఎలాగైనా సరే నేను బిడ్డను కనే తీరుతాను అని అంటుంది మరి అలాంటప్పుడు ఆస్తి మొత్తం పంచమికి దాని పాము పిల్లకే వెళ్ళిపోతుంది కదా అలా జరగకూడదు అంటే ముందు పంచమి బిడ్డను కనకూడదు తను బిడ్డను కనకుండా చేయాలి అంటే మనకు ఏమైనా దానిలాగా పాములకు ఉన్న శక్తులు ఉన్నాయా ఏంటి? ఒకవేళ ఉన్నా ఏమైనా చేసిన ఆ పాముల పిల్ల పంచమి పసిగట్టేస్తుంది కాబట్టి మనము ఇక ఆస్తి పంపకాలు పెట్టుకుంటే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది అని అంటుంది. కుమార్ మీకైతే ఒక పాప ఉంది మీకు వస్తుంది ఆస్తి కానీ మాకు మాత్రం ఎవరున్నారు చెప్పు ఆస్తి పిల్లల పేరు మీద రాస్తాను అంటే మాకు ఏమీ రాదు కదా అంటాడు కుమార్ చిత్ర మీరేమీ బాధపడకండి బావగారు నేను ఇద్దరు కవల పిల్లల్ని కానీ మీకు ఒకరిని ఇస్తాను మీరు సాదుకోండి అని అలాగే జ్వాల అక్క నువ్వు పిల్లలు కనడానికి ఏమీ శ్రమ పడకు నేనున్నాను కదా పిల్లల్ని కానీ ఒకరిని నీకు ఇస్తాను అంటుంది చిత్ర.
భార్గవ్ ఏంటి నువ్వు అనుకుంటే అయిపోతుందా అదికాక కవల పిల్లలు అనగానే పుట్టేస్తారా ఏంటి అంటాడు.చిత్ర మీరు మాటలు మాట్లాడడం ఆపి ఇక మనం అదే పనిలో ఉందాం పదండి అంటూ భార్గవ్ ని తీసుకు వెళుతుంది. కుమార్ జ్వాలను చూస్తూ జ్వాలా మనం కూడా పిల్లల్ని కనే ప్రయత్నం చేద్దామా అంటూ తన దగ్గరికి వెళతాడు. జ్వాల అందుకు ఇంకా టైం ఉంది వెళ్ళండి అంటూ నెట్టి వేస్తుంది. జ్వాల ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. చిత్ర జ్వాల దగ్గరికి వచ్చి అక్క ఏం చేస్తున్నావ్ నువ్వేమీ టెన్షన్ పడకు నేనున్నాను కదా నేను పిల్లల్ని కానీ ఒకరిని నీకు ఇస్తానని చెప్పాను కదా ఇంకా పిల్లల గురించి ఆలోచిస్తున్నావా అంటుంది చిత్ర.
అప్పుడే భార్గవ్ కుమార్ ఇద్దరూ తాగి వస్తారు వాళ్లను చూసినా చిత్ర జ్వాలా షాక్ అవుతారు. భార్గవ్ జ్వాలాని తీసుకుని వెళ్ళిపోతాడు కుమార్ జ్వాల దగ్గరకు వెళ్లి ప్లీజ్ మనం కూడా పిల్లల్ని కందము అంటాడు. జ్వాల కోపంగా కుమార్ ని నెట్టు వేస్తుంది. ఖరాలి తన మంత్ర శక్తితో ఇదంతా చూస్తూ వెంటనే జ్వాల మీదికి ఒక శక్తిని పంపిస్తుంది.వెంటనే జ్వాలా శరీరంలో వ్యామోహం కలిగి కుమార్ దగ్గరికి వెళుతుంది కుమార్ జ్వాలని చూసి ఏంటి జ్వాలా ప్లీజ్ నా మాట కాదనకు అంటాడు.
జ్వాల నేను నీ మాట ఏమీ కాదనడం లేదు మనం ఇద్దరం కలిసి పిల్లల్ని కందాం అని అంటుంది. భార్గవ్ జ్వాలా కలుసుకుంటారు. ఖరాలి ఇక వెంటనే ఆ గరుడ రాజుని పిలిచి ఇదిగో చూడు గరుడ రాజా నువ్వు సూక్ష్మరూపంధాల్చి అదిగో అలా కనిపిస్తున్న జ్వాల గర్భంలోకి ప్రవేశించు ఆ జ్వాల గర్భంలో నువ్వు గరుడ శక్తితో కలిగిన మానవ రూపంలో పుడతావు అని అంటుంది.గరుడ రాజు అలాగే కరాలి ఇప్పుడే వెళతాను అంటూ అక్కడి నుండి జ్వాల ఇంట్లోకి వస్తాడు గరుడ రాజు.