కరోనా వైరస్ తెలంగాణలో విజృంభిస్తున్న తీరు మరియు మరీ ముఖ్యంగా హైదరాబాద్ కబలించిన వైఖరి చూస్తుంటే భయంగానే ఉంది. అయితే ఈ వ్యాధి ప్రబలిన మొదట్లో వరుస ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు ధైర్యం చెప్పిన కెసిఆర్ ఇప్పుడు మాత్రం అసలు కనిపించట్లేదు. దీనికి కారణం అతనికి కూడా కరోనా సొకడమే అని పలు వార్తలు బయటకు వచ్చాయి.
కరోనా విస్తృతంగా పెరుగుతున్న సమయంలోనే వందలాది మందితో కొండపోచమ్మ ప్రాజెక్టు ను ప్రారంభించారు. దానితో పాటు ఇటీవల తెలంగాణలో హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా దాని వల్ల కూడా కొంత మంది ఎమ్మెల్యేలకు కరోనా వ్యాపించిందని రిపోర్టులు వచ్చాయి. ఇక తాజాగా ప్రగతిభవన్ లో దాదాపు 30 మందికి పైగా కరోనా బారిన పడ్డారు.
ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్ కరోనా రావడంతోనే ఆయన ని ఫామ్ హౌస్ కి తరలించి అక్కడ అన్నీ ఏర్పాట్లు చేసి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ హోం శాఖ మంత్రి మరియు నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా ప్రగతి భవన్ లో ఎప్పుడూ సమీక్ష మీటింగ్ నిర్వహిస్తున్న కేసీఆర్ కు సోకి ఉంటుందన్న అభిప్రాయాలు బయటకు వస్తున్నాయి. అలా జరిగే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. దేనిని కొట్టిపారేయలేం.
ఇక ఇందులో ఎంత వాస్తవం ఎంత ఉందో తెలియాలంటే ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాలి. అప్పటి వరకూ ఈ మహమ్మారి నుండి ప్రజలంతా త్వరగా బయట పడాలని… సీఎం కేసీఆర్ కూడా మళ్లీ మునుపటిలా వచ్చి ధైర్యంగా ప్రెస్ మీట్ లు పెట్టాలని కోరుకుందాం.