ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకీ వికృతరూపం దాలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 1,19,48,173 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 5,46,547 మంది మృతి చెందగా.. కరోనా నుంచి కోలుకున్న బాధితుల సంఖ్య 68,49,012 గా ఉంది.
భారత్ లో కూడా కరోనా వైరస్ విస్తృతంగా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో 23,135 కరోనా పాజిటివ్ కేసుల నమోదవ్వగా 479 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకు 7,43,481 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 20,653 మంది మృతి చెందగా.. కోలుకున్న 4,57,058 మంది బాధితులు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల సంఖ్య 2,65,670 గా ఉంది.
తెలంగాణలో రాష్ట్రంలో 27,612కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. నిన్న 1879 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే 1422 పాజిటివ్ కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నిన్న 7గురు కరోనాతో మృతి చెందారు.
ఏపీలో 21,197కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. నిన్న 1,178 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 13 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 252 మంది మృతి చెందగా 11,200 యాక్టివ్ కేసులు ఉన్నాయి.