రీసెంట్ గా పెంగ్విన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కీర్తి సురేష్. ఈ సినిమాలో ఒక ఛాలెంజింగ్ రోల్ చేసి అందరినీ ఆకట్టుకుంది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కీర్తి నటనకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. థియోటర్స్ ఓపెన్ అయ్యో వరకు ఉండాల్సిన అవసరం లేదనుకున్న మేకర్స్ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేసి పడేశారు. అయితే అదే ఇప్పుడు కీర్తి సురేష్ కి సమస్యగా మారుతుందా అని విశ్లేషకులు అంటున్నారట. వాస్తవంగా ఇప్పుడు తెలుగు తమిళ సినిమాలు ఎక్కువగా చేస్తుంది ఒక్క కీర్తి సురేష్ మాత్రమే. తన చేతిలో దాదాపు 6-7 సినిమాలున్నాయి. వాటిలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు ఉన్నాయి.
అయితే ఆ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను పెంగ్విన్ సినిమా మాదిరిగానే ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. వాస్తవంగా పెంగ్విన్ కి ముందే కీర్తి సురేష్ నటించిన మరో సినిమా మిస్ ఇండియా కి ఓటీటీ ప్లాట్ ఫాం నుంచి భారీ ఆఫర్ వచ్చిందట. ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో రూపొందింది. అయితే అప్పటికే పెంగ్విన్ అమోజాన్ ప్రైం లో రిలీజ్ అవుతున్న విషయం కన్ఫర్మ్ అవడం తో ఈ సినిమా తర్వాత రిలీజ్ చేస్తే ఇంకా డిమాండ్ ఉంటుందన్న ఆలోచనలో మేకర్స్ ఆ భారీ ఆఫర్ ని రిజెక్ట్ చేశారట. కాని పెంగ్విన్ రిజల్ట్ చూశాక ఇప్పుడు మిస్ ఇండియాకి ఆ భారీ ఆఫర్ నుంచి కొంత కోతపడిందట.
దాంతో మేకర్స్ చేసేదేమి లేక డీల్ సెట్ చేసుకున్నట్టు సమాచారం. అన్నీ ఓకే అయితే త్వరలో మిస్ ఇండియా కూడా ఓటీటీలో చూసేయొచ్చు. అంతేకాదు హీరోయిన్ ఓరియెంటెడ్ గా రూపొందిన మరో సినిమా గుడ్ లక్ సఖీ సినిమాని కూడా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారని అంటున్నారు. అయితే కీర్తి సురేష్ నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలన్ని ఇలా ఓటీటీలో రిలీజైతే తన మార్కెట్ దెబ్బతింటుందని చెప్పుకుంటున్నారు. వాస్తవంగా ఆలోచిస్తే అదీ కరెక్టే కదా. ఈ సినిమాలే థియోటర్స్ లో రిలీజయితే కీర్తి సురెష్ రేంజ్ వేరేలా ఉండేది. కాని ఇలా ఓటీటీలో రిలీజ్ చేయడం ఒకరకంగా తనకి మైనస్ అన్న టాక్ వినిపిస్తుంది.