కింగ్ అక్కినేని నాగార్జున లేటెస్ట్ సినిమా తాజాగా అనౌన్స్ చేశారు మేకర్స్. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన గరుడ వేగా ఫేం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. నేడు ఏషియన్ గ్రూప్ చైర్మన్ నారాయణ్ దాస్ నారంగ్ జన్మదినం సందర్భంగా ఈ సినిమాని అనౌన్స్ చేసి అక్కినేని ఫ్యాన్స్ కి భారీ సర్ప్రైజ్ ఇచ్చారు.
కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమాని భారీ బడ్జెట్ తో శరత్ మరార్, పుస్కూర్ రామ్మోహన్ రావు, నారాయణదాసు నారంగ్ నిర్మిస్తుండటం విశేషం. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ , ఇతర నటీ నటులు, టెక్నీషియన్స్ గురించి త్వరలో వెల్లడిస్తారట.
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున 2014లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సోగ్గాడే చిన్నినాయన సినిమా బ్లాక్ బస్టర్ అందుకుంది. అంతే మళ్ళీ ఇంతవరకు నాగార్జున కి మంచి హిట్ దక్కలేదు. ప్రస్తుతం బ్రహ్మాస్త్ర అనే బాలీవుడ్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శత్వంలో యాక్షన్ బేస్డ్ ఫాంటసీ డ్రామాగా ఎంతో భారీ ఖర్చుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, ఆలియా భట్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
ఇక వైల్డ్ డాగ్ అనే యాక్షన్ సినిమాలో నటిస్తున్న నాగార్జున.. ఎన్.ఐ.ఏ. ఆఫీసరుగా కనిపించనున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి అహిషోర్ సాల్మన్ దర్శకత్వం వహిస్తున్నారు. అందరూ కొత్తవాళ్లతో నిర్మితమవుతున్న ఈ సినిమా థియోటర్స్ ఓపెన్ అయితే వచ్చే డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రావచ్చు.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!