రిజర్వేషన్ల అంశంతో వైసీపీని ఇరుకున పెట్టే వ్యూహం
కలిసి రాని బీజేపీ…పట్టించుకోని టీడీపీ ..
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా కొత్త డిమాండ్ తో కొత్త రాజకీయానికి తెర లేపే యత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఊహించని ఎదురు దెబ్బ పవన్ కళ్యాణ్ తిరిగి ప్రజల్లో నిలబడ టానికి కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు.
అందులో భాగంగా..కొద్ది రోజుల క్రితం కాపు ఉద్యమ నేత ముద్రగడ తనపైన సోషల్ మీడియాలో జరుగుతున్న విమర్శల దాడికి మనస్థాపానికి గురై తాను ఉద్యమ నాయకత్వ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత కొందరు పవన్ కళ్యాణ్ వైపు ఆశగా చూసారు. అనేక తర్జనల భర్జనల తరువాత పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల ముందు జగన్ కాపు రిజర్వేషన్ల విషయంలో చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు అధికారంలో ఉంటూ మరోసారి చెప్పాలని డిమాండ్ చేసారు. ఆ వెంటనే కేంద్రం ప్రకటించిన అగ్రవర్ణాల రిజర్వేన్లను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే, చాలా కాలం తరువాత కీలక అంశం మీద పవన్ కళ్యాణ్ స్పందిస్తూ..ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా..ఆయనకు ఆశాభంగం తప్పలేదు. పవన్ డిమాండ్ పైన మిత్రపక్షం బీజేపీ సహా..మాజీ మిత్రపక్షం టీడీపీ సైతం స్పందించలేదు. దీంతో..పవన్ ఈ కొత్త నినాదాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు..వైసీపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
పవన్ డిమాండ్ పైన కరువైన స్పందన…
2019 ఎన్నికల సమయంలో తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేసిన జగన్ అక్కడ కీలక ప్రకటన చేసారు. కాపు రిజర్వేషన్ల విషయం తన చేతుల్లో లేదని..చేయగలిగినది ఏమైనా ఉంటే చేస్తానని ..సాధ్యం కాని హామీలు తాను ఇవ్వలేనని తేల్చి చెప్పారు. అదే అక్కడ రాజకీయంగా చర్చకు కారణమైంది. కాపుల డెవలప్ మెంట్ కోసం ఏడాదికి రెండు వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలు పూర్తయ్యాయి. అదే తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ నాలుగు..జనసేన ఒక్క సీటు గెలవగా మిగిలిన సీట్లు వైసీపీ గెలిచింది. ఇక, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం తాను కాపు ఉద్యమ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇది జరిగి రోజులుగా గడుస్తున్నా..ఆయన నిర్ణయంలో మార్పు ఉన్నట్లుగా కనిపించటం లేదు. ఇక, దీంతో..పవన్ కు దగ్గరగా ఉండే కొందరు నేతలు కాపు ఉద్యమానికి జై కొట్టాలని…ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి రిజర్వేషన్లు అమలు కోసం లీడ్ తీసుకోవాలని ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినట్లె సమాచాం. దీంతో..పవన్ ప్రత్యేకంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అప్పుడు చెప్పటం కాదు..ఇప్పుడు అధికారంలో ఉన్న వారు కాు రిజర్వేషన్ల గురించి మరోసారి ప్రకటన చేయాలని డిమాండ్ చేసారు. పవన్ డిమాండ్ లో పరిపక్వత లేదని కొందరు..ఎన్నికల ముందే క్లియర్ గా చెప్పిన విషయాన్ని..ఇప్పుడు పవన్ మరోసారి చెప్పాలంటూ డిమాండ్ చేయటం సరి కాదని మరి కొందరు..దీని వెనుక పవన్ కొత్త వ్యూహం అమలు చేసే ఆలోచనలో ఉన్నారంటూ పవర్ స్టార్ అభిమానులు విశ్లేషిస్తున్నారు.
బీజేపీ..టీడీపీ సైతం దూరంగానే ఉన్నాయా..
పవన్ కల్యాన్ మరో డిమాండ్ చేసారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్రవర్ణాల రిజర్వేషన్లను అమలు చేయాలని కోరారు. టీడీపీ ప్రభుత్వం ఇదే కోటాలో కాపులకు అయిదు శాతం అమలు చేస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయితే, అప్పటికే కాపులను బీసీల్లో చేరుస్తూ మంజునాధ కమిషన్ నివేదిక ఆధారంగా తాము నిర్ణయం తీసుకుంటున్నట్లు కేంద్రానిని నివేదించింది. దీంతో..ఈ రెండు తీర్మానాల్లో అసలు ఏపీ ప్రభుత్వం ఏం కోరుకుంటోంది అంటూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. జగన్ సీఎం అయిన తరువాత గత ప్రభుత్వం తీసుకున్న ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లలో కాపులకు అయిదు శాతం ఇవ్వాలనే ప్రతిపాదనను రద్దు చేసారు. ఇప్పుడు పవన్ అగ్రవర్ణాల రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేసినా..ఆయన వాదనకు మద్దతుగా బీజేపీ..టీడీపీ నేతలు బయటకు రాలేదు. సహజంగా వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సిద్దంగా ఉండే టీడీపీ సైతం మౌనంగానే ఉంది. జనసేనకు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ఈ వ్యవహారంలో ఆచి తూచి వ్యవహరించాలని భావిస్తోంది. అయితే, అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వే షన్లు ఏ రాష్ట్రంలోనూ అమలు కావటం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరి..తన డిమాండ్ కు పెద్దగా మద్దతు రాకపోవటంతో..పవన్ దీనిని ఇక్కడితో వదిలేస్తారా..లేక మరింతగా మద్దతు లభించేలా తన కార్యాచరణను అమలు చేస్తారా అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారుతోంది.