టాలెంటెడ్ డైరెక్టర్ తేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలని ప్రకటించాడు. అందులో ఒక సినిమా యాక్షన్ హీరో గోపీచంద్ తో తెరకెక్కించబోయో అలిమేలుమంగ వెంకటరమణ. ఈ సినిమా కోసం ప్రస్తుతం హీరోయిన్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. కీర్తి సురేష్, కాజల్ అగ్ర్వాల్, సాయి పల్లవి ..ఇలా పలువురు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మరి అలిమేలుమంగ గా ఎవరిని తీసుకోనున్నారో ఇంకా క్లారిటీ రాలేదు.
ఇక ఈ సినిమా తర్వాత రానా దగ్గుబాటి తో ఒక సినిమా చేయబోతున్నారు తేజ. గతంలో తేజ, రానా కాంబినేషన్ లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అంత కుంచి హిట్ కొట్టాలన్న ప్లాన్ తో తేజ ఒక డిఫ్రెంట్ స్టోరీని రానా కోసం రెడీ చేశాడట. రెండు సినిమాలతో పాటు ఒక వెబ్ సిరీస్ ను తెరకెక్కించబోతున్నట్లుగా తేజ ఇటీవల చెప్పుకొచ్చారు.
తాజాగా ఆ వెబ్ సిరీస్ గురించి న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. దర్శకుడు తేజ నిర్మాణంలో ఇప్పటికే ఆ వెబ్ సిరీస్ చిత్రీకరణ కంప్లీట్ అయిందని సమాచారం. తన అసోసియోట్ రాజేష్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సిరీస్ ని తేజ నిర్మించాడని తెలుస్తుంది. ఈ వెబ్ సిరీస్ కి కథ, స్క్రిప్ట్ తేజా అందివ్వడం విశేషం. ఇక గంట నిడివి ఉండేలా ఈ వెబ్ సిరీస్ రూపొందగా నైజాం కాలం నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ లవ్ స్టోరీ గా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కించినట్టు తెలుస్తుంది. బోల్డ్ కంటెంట్ కావడంతో తేజ ఈ వెబ్ సిరీస్ కి తన పేరు టైటిల్ కార్డ్స్ లో వేసుకోలేదని అంటున్నారు. ఇక త్వరలో ఈ వెబ్ సిరీస్ ని రిలీజ్ చేస్తారట.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!