మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండల ఎమ్మార్వో నాగరాజు కోటి రూపాయలు లంచం కేసులో కొత్త ట్విస్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో సరికొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారి అంజిరెడ్డి గెస్ట్హౌస్కు నాగరాజు రాగా అప్పటికే సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న విషయం తెల్సిందే.
అనంతరం అవినీతి నిరోధక శాఖ అధికారులు నిర్వహించిన సోదాల్లో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి సంబంధించిన ఎంపీ లాడ్స్ నిధుల ఫైళ్లు బయటపడినట్లు తెలుస్తోంది. అలాగే కలెక్టర్ ఆఫీసులో ఉండాల్సిన పలు కీలక పత్రాలు కూడా అంజిరెడ్డి వద్ద ఉన్నాయి. రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంజిరెడ్డికి, రేవంత్ రెడ్డికి మధ్య సంబంధాలు ఉన్నట్లు ప్రాధమిక అంచనాకు వచ్చారు ఏసీబీ అధికారులు. ఈ కేసులో ఇంకా ఎన్ని సరికొత్త విషయాలు వెలుగుచూస్తాయో చూడాలి.