NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

రాష్ట్రంలో నయా “సంచలనం”..! ఇక ఆ మీడియాపై జగన్ కన్నెర్ర!!

 

రాష్ట్రంలో రాజకీయం పీక్స్ లో ఉంది. వారానికొక కొత్త అంశం తెరమీదకు వస్తూ సరి కొత్త వివాదాలకు దారితీస్తోంది. టిడిపి, వైసిపి మధ్య, వారి వారి అనుకూల మీడియాల మధ్య నువ్వా నేనా అనుకునేంతగా పోరాటం జరుగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, వ్యంగ్యాలు అన్నీ తోడవుతున్నాయి. అయితే ఇది ప్రస్తుతం క్లైమాక్స్ కు చేరుకున్నట్లే కనిపిస్తుంది. రాష్ట్రంలో ఓ కొత్త సంచలనమైన అంశం తెర మీదకు వచ్చింది.. ఇంతకీ ఏమిటా అంశం అని చూస్తే…

Abn radha krishna ys jagan

 

న్యాయవ్యవస్థపై నిఘాతో ఏబీఎన్ ఆర్కే సంచలనం.. ఓకే

రాష్ట్రంలోని న్యాయమూర్తుల ఫోన్ లు ప్రభుత్వం ట్యాప్ చేస్తోంది.వాళ్ళ ప్రతి వాట్సాప్ మెసేజ్ ను కూడా ప్రభుత్వం చూస్తోంది. ప్రభుత్వ పెద్దలు కొంత మంది ఇదే పనిలో ఉన్నారు. మొత్తానికి రాష్ట్రంలో న్యాయవ్యవస్థపై ప్రభుత్వం నిఘా పెట్టింది. జడ్జీల ప్రతి కదలిక, ప్రతి సందేశం, ప్రతి మాట కూడా ప్రభుత్వ కనుసన్నల్లో ఉంచుకొంటోంది అంటూ ఆంధ్రజ్యోతి పత్రిక నిన్న ఒక సంచలన కథనం రాసింది. అయితే కధనం అంతా ఊహాతీతంగా, వేకుగా ఉంది. ఎటువంటి ఆధారాలను చూపించలేదు. కేవలం ఒక ఉదాహరణ పేర్కొంటూ మాత్రమే కథనాన్ని వండి వార్చింది. అయితే కధనంలో ఆధారం, ఉదాహరణలు ఎంత బలహీనంగా ఉన్నా అంశం మాత్రం సంచలనాత్మకమైనదే. అందుకే దీనిపై ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది.

మూడు గంటల్లోనే సర్కారు లీగల్ నోటీసు

నిన్న ఈ కథనంపై ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించింది. సాధారణంగా ఏదైనా పత్రికకు లీగల్ నోటీస్ ఇవ్వాలంటే ఒకటి రెండు రోజులు వేచి చూసి ప్రభుత్వ అధిపతి అనుమతితో లీగల్ నోటీసులు ఇచ్చే ప్రభుత్వం ఈ కధనంపై మాత్రం వెంటనే స్పందించి నిన్న మధ్యాహ్ననికే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు, ఆ పత్రిక ఎడిటర్ కు, ఆ పత్రిక పబ్లిషర్ కు ఏడు పేజీల లీగల్ నోటీసులు పంపించింది. ఆధారాలు చూపించాలని, సమాధానం చెప్పాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని, చట్టపరంగా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వం చెప్పింది. అంటే ఈ కథనంపై ప్రభుత్వం కూడా సీరియస్ గానే తీసుకుంది. ఎక్కడ తమ పట్టు కోల్పోకుండా రాధాకృష్ణ ను ఇరుకున పెట్టాలా న్యాయ వ్యవస్థపై నిఘా అన్న కథను అబద్ధం అని నిరూపించేందుకు ప్రభుత్వం కూడా అడుగులు ముందుకే వేస్తుంది. ఇలా వైసీపీ ప్రభుత్వం వర్సెస్ ఆంధ్రజ్యోతి ఏబీఎన్ అనే వరకు వచ్చింది. మధ్యలో న్యాయవ్యవస్థ ప్రస్తుతానికి నిలబడింది.

కోర్టులో నిరూపించకపోతే…!!

ఈ కథనం మొత్తం అంశంలో రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి వైసిపి, వైసిపి లో అధికారులు. రెండు ఆంధ్రజ్యోతి పత్రిక, ఆమోద పబ్లికేషన్స్. ఈ కథనం నిజం అని ఆంధ్రజ్యోతి కోర్టులో నిరూపించుకోవాల్సి ఉంటుంది. తమ వద్ద ఉన్న ఆధారాలు బయట పెట్టాల్సి ఉంటుంది. అది జరిగితే.. అంటే ప్రభుత్వం నిజంగా న్యాయవ్యవస్థ పై నిఘా నిజంగా ఉంచితే.., కారకులు, అధికారులపై చర్యలు తీసుకుంటారో కానీ న్యాయవ్యవస్థ మాత్రం ఈ అంశాన్ని సీరియస్ గానే పరిగణిస్తోంది. లేని పక్షంలో కథనం ఆవాస్తవం, ఉహాజనితం అయితే ఆంధ్రజ్యోతి పత్రిక కూడా మూత దశకు చేరుకుంటుంది. కధ క్లైమాక్స్ కు చేరుతోంది. ప్రభుత్వం.. ఆంధ్రజ్యోతి పై చర్యలు తీసుకోవడానికి ఈ కథనాన్ని సరైన అస్త్రంగా వాడుకునే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వమా? ఆంధ్రజ్యోతి వ్యవస్థ? అనేది ఈ కథనం ద్వారా ఈ అంశం ద్వారా తేలిపోనుంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !