లండన్ బ్యూటీ ఎమీ జాక్సన్ 2010 లో వచ్చిన ‘మదరాసి పట్టణం’ సినిమాతో కోలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆర్య హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఎమీ జాక్సన్ ఇండస్ట్రీ దృష్ఠిని బాగా ఆకర్శించింది. మొదటి సినిమాతో సక్సస్ తో పాటు మంచి నటి అన్న పేరు రావడంతో వరసగా సినిమా అవకాశాలు వచ్చాయి. కాని ఎమీ జాక్సన్ మాత్రం చాలా సెలెక్టెడ్ గా సినిమాలు చేసింది.
ఇక ఎమీ జాక్సన్ మొదటి సినిమా హిట్ అవగానే పలువురు దర్శకులు సంప్రదించడం తో పాటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి అవకాశాలు వచ్చాయి. అలాగే ఇండియన్ జేమ్స్ కామెరూన్ గా అందరూ పిలుచుకునే ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ కూడా ఎమీ జాక్సన్ కి విపరీతంగా అట్రాక్ట్ అయ్యాడు. వరసగా రెండు భారీ ప్రాజెక్ట్ లో ఎమీ జాక్సన్ కి అవకాశాలిచ్చాడు.
విక్రమ్ తో తీసిన ప్రయోగాత్మక చిత్రం ‘ ఐ ‘ ఒకటి కాగా మరో సినిమా కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో 2.ఓ. ఈ రెండు సినిమాలు ఎమీ జాక్సన్ కి హీరోయిన్ గా మంచి పేరు తెచ్చి పెట్టాయి. కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడే లండన్ కి చెందిన బిజినెస్ మెన్ జార్జ్ పనయోటౌని 2019 జనవరి 1న వివాహం చేసుకుంది. ఆ తరువాత ప్రెగ్నెంట్ కావడంతో రెండేళ్లుగా సినిమాలకు దూరంగా వుంది. అదే సంవత్సరం సెప్టెంబర్ లో ఆండ్రియాస్ కు జన్మనిచ్చిన ఎమీ జాక్సన్..తన బుల్లి రోబో తో గడుపుతూ ఎప్పటికప్పుడు ఫొటోల ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది.
దీంతో ఎమీ జాక్సన్ ఇక సినిమాలు మానేసినట్టే అని అందరూ భావించారు. అయితే సినిమాల్లోకి రాక ముందే సూపర్ గర్ల్ గా ఓ టీవీ సిరీస్ లో నటించిన ఎమీ జాక్సన్ ప్రస్తుతం ఓ అమెరికన్ సూపర్మెన్ సిరీస్ ని అంగీకరించిందని అందులో సూపర్ గర్ల్ గా కనిపించబోతోందని తాజా సమాచారం. అందుకు సంబంధించి సెట్ లో మేకప్ వేసుకుంటున్న లేటెస్ట్ ఫొటోలని ఎమీ అభిమానుల కోసం షేర్ చేసింది. మొత్తానికి ఎమీ జాక్సన్ జాక్సన్ కెమెరా ముందుకు వస్తుందనగానే ఫ్యాన్స్ కి పట్టరాని సంతోషం కలుగుతోందట.