సాధారణంగా దక్షిణాది రాజకీయాలంటే ఉత్తరాది లో ఉన్న పార్టీ పెద్దలకు చాలా చులకన భావం ఉంటుంది. చాలా వరకు దక్షిణ భారతదేశానికి చెందిన రాజకీయ నేతలు తమ స్వార్థం కోసం రాజకీయాల్లోకి వచ్చి తమ వ్యాపారాలను చక్కబెట్టు కుంటారనే భావన ఇప్పటికీ నార్త్ లో ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అయితే చాలా దారుణంగా పార్టీ అధిష్టానం పెద్దలు…. దక్షిణాది నాయకులను చూస్తారనే టాక్ ఉంది. అటువంటి దృక్పధం కలిగిన ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మెడలు వంచింది మాత్రం వైయస్ రాజశేఖర్ రెడ్డి అని చాలామంది చెబుతారు. అధిష్టానం నుండి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా, ముందే ప్రజలకు హామీలు ఇచ్చి, నిధులు ఏదో రీతిలో తనకు ఇవ్వాలని తెచ్చుకునే దమ్మున్న నాయకుడు వైయస్సార్.
అదే రీతిలో ఎన్నికల సమయంలో కచ్చితంగా ఎన్ని స్థానాలు గెలుస్తానో ముందే వైయస్ కాంగ్రెస్ పెద్దలకు తెలియజేసే వారని పార్టీ సీనియర్స్ అంటుంటారు. వైస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయం, పరిపాలన చాల వరకు ‘ ఏక చత్రాధిపత్యం ‘ తరహాలో ఉంటుందని అంటారు. ఆయన గెలుపు వీరుడు అనే పేరు పార్టీలో సీనియర్స్ దగ్గర సంపాదించడం జరిగింది. ప్రజంట్ వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉండి ఉంటే దేశ రాజకీయ ముఖచిత్రం మరోలా ఉండేదని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయేది కాదు అని కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలే చెబుతుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అవుతుంది అనగా తన పాదయాత్రతో 1467 కిలోమీటర్లు నడిచి….. రాష్ట్రంలో ఉన్న రైతుల బాధలను తెలుసుకోవడమే కాక ప్రతి పేద విద్యార్థికి చదువు అందేలా పరిపాలన అందించారని, ఆయన వల్లే….కేంద్రంలో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అంటారు.
ముఖ్యంగా 2009 ఎన్నికలలో చిరంజీవి పార్టీ పెట్టిన టైంలో కాంగ్రెస్ అధిష్టానం భయపడింది అని…. కానీ వైయస్ రాజశేఖర్ రెడ్డి మాత్రం కచ్చితంగా 30కి పైగా స్థానాలు రాష్ట్రంలో గెలిపించుకుని వస్తానని మాట ఇచ్చి గెలిచి….గెలుపు కి స్పెల్లింగ్ నేర్పించిన రాజకీయ ధీరుడు గా రాజశేఖర్ రెడ్డి 2009 ఎన్నికల్లో తన దమ్మేంటో చూపించారు. నిజంగా ఆ సమయంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన గాని వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తను చేసుకు పోవటం ఢిల్లీలో ఉన్న హైకమాండ్ కి మతి పోయిందని పార్టీ సీనియర్ నాయకులు ఇటీవల చెప్పుకొచ్చారు. ఆయన చనిపోవడమే కాంగ్రెస్ పార్టీకి పెద్ద డ్యామేజ్ జరిగిందని…. ఆయన స్థానాన్ని మరెవరూ పురించ లేరని పేర్కొన్నారు.