బిగ్ బాస్ షో కి వస్తున్న ఆదరణ నమోదవుతున్న టిఆర్పి రేటింగులు సంచలనాలు రేపుతున్నాయి. ముఖ్యంగా హౌస్ లో ఇంటి సభ్యులు ఆడుతున్న చూసే ప్రేక్షకులకు షోపై ఎంతగానో ఇంట్రెస్ట్ పుట్టిస్తున్నాయి. కాగా ఆరో వారం లో బిగ్ బాస్ నాణేలు టాస్క్ లో బ్లూ టీం చేయాల్సిన అరగుండు టాస్క్ చేయకపోవటంతో వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున అరగుండు ప్రస్తావన తీసుకొచ్చారు. బ్లూ టీం సభ్యులను లేగమని ఎందుకు చేయలేదు ప్రశ్నించారు.
బిగ్ బాస్ ఇచ్చిన డీల్ ఇంటి సభ్యులు కంప్లీట్ చేయకపోవడంతో నాగార్జున మరో ఆఫర్ తీసుకొచ్చారు. అరగుండు టాస్క్ బ్లూ టీంలో ఎవరైనా చేస్తే నెక్స్ట్ వీక్ నామినేషన్ లేకుండా చేస్తానని మాట ఇచ్చారు. దీంతో బ్లూ టీం సభ్యులు నోయల్, అఖిల్, కుమార్ సాయి అంతా సైలెంట్ అవ్వగా… అమ్మ రాజశేఖర్ మాత్రం అంతకు ముందు నేను మాట ఇచ్చాను… కాబట్టి దాన్ని నేనే కంప్లీట్ చేస్తాను అంటూ ముందుకు వచ్చారు. ఆఖరి సారి అడుగుతున్న అరగుండు టాస్క్ ఇష్టపూర్వకంగా చేస్తున్నారా మాస్టర్ అని నాగార్జున పదేపదే ప్రశ్నించారు.
దానికి అమ్మ రాజశేఖర్ ఆలోచించు కొగా… మరో పక్క ఇంటి సభ్యులు వద్దు మాస్టర్ అని వాదిస్తున్నారు. కానీ అమ్మ రాజశేఖర్ ఓకే చెప్పడంతో అరగుండు తో పాటు మీసం కూడా సగానికి కాట్ అయిపోయింది. నాగార్జున కూడా ఏం మాట్లాడలేదు… దీంతో నెక్స్ట్ వీక్ నామినేషన్ నుండి అమ్మ రాజశేఖర్ సేవ్ అయిపోయారు. కానీ ఇప్పటివరకు తెలుగు లో జరిగిన బిగ్ బాస్ అన్ని సీజన్లలో కల్లా అమ్మ రాజశేఖర్ అరగుండు కొట్టించుకోవడం హైలెట్ అని బయట జనాలు మరియు సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.