యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమా రాధే శ్యామ్. గోపీకృష్ణ మూవీస్, యూవి క్రియోషన్స్ బ్యానర్స్ పై వంశీ – ప్రమోద్ – ప్రశీద కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ఈటలీ లో శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇటీవలే ఈ సినిమా నుంచి హీరోయిన్ గా నటిస్తున్న పూజా హెగ్డే లుక్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో సినిమా మీద బాగా బజ్ క్రియోట్ అయింది. ఇక ఈ సినిమా నుంచి అందరూ ఎంతో ఆతృతగా టీజర్ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.
కాగా ఈ సినిమా నుంచి వరసగా అప్డేట్స్ వచ్చి ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించి వచ్చిన రెండు అప్డేట్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రభాస్ స్వయంగా ఫ్యాన్స్ ఊహించని అప్డేట్ ను ఇచ్చాడు. ఈ అక్టోబర్ 23న టీజర్ వస్తుంది అంటూ క్లాసికల్ వింటేజ్ పోస్టర్ తో ప్రకటించి ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చాడు. అలాగే ఇదే టీజర్ తో పాటు “బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్” ను కూడా పరిచయం చేస్తున్నట్టు అఫీషియల్ గా తెలిపాడు.
ఇక ఎప్పటి నుంచో ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న పూజా హెగ్డే ది డ్యూయల్ రోల్ అని ప్రచారం జరుగుతుంది. అయితే అందులో వాస్తవం లేదని సమాచారం. అంతేకాదు పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది కాబట్టి పౌరాణిక పాత్ర అని అనుకున్నారు. అందులో కూడా నిజం లేదట. అయితే ఇప్పటి వరకు చేసిన సినిమాలన్ని ఒకటైతే రాధే శ్యామ్ ఒక్కటే ఒకటని .. ఈ సినిమాలో పూజా గెటప్స్, కాస్ట్యూంస్ ఎంతో క్లాసీగా గా ఉంటాయని తెలుస్తుంది.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!