బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఫైనల్ వీక్ రన్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే చివరి వారం రసవత్తరంగా షో ఉండేవిధంగా షో నిర్వాహకులు అదిరిపోయే రీతిలో ప్లాన్లు వేస్తున్నారు. ఈ క్రమంలో సీజన్ త్రీ లో రన్నరప్ గా నిలిచిన శ్రీముఖి అదేవిధంగా అదే సీజన్లో కంటెస్టెంట్ గా ఉన్న అలీ రెజా తోపాటు గీతా మాధురి, హరితేజ ని హౌస్ లో ఉన్న టాప్ ఫైవ్ సభ్యులతో ముచ్చటించే కార్యక్రమాన్ని పెట్టారు షో నిర్వాహకులు.
దీంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు వీళ్ళందర్నీ చూసి షాక్ అయ్యి మిమ్మల్ని ఇలా చూడటం చాలా ఆనందంగా అభి వేసిన డైలాగ్ కి శ్రీముఖి, హరితేజ, గీతా మాధురి మమ్మల్ని కూడా వదలవా అంటూ సరదాగా అభి పై పంచులు వేసి హౌస్ లో నవ్వులు పూయించారు. తర్వాత వెంటనే శ్రీముఖి అఖిల్ ని టార్గెట్ చేసి మోనాల్ వెళ్లిపోయిన నాటినుండి చాలా డల్ అయ్యావని అనగా పక్కనే ఉన్న సోహెల్ హౌస్ లో మిగిలి ఉన్న ఇద్దరు లేడీ కంటెస్టెంట్ ల తో పులిహార కలుపుతూ బానే ఉన్నాడని చెప్పటంతో హౌస్ లో ఒక్కసారిగా కామెడీ వాతావరణం నెలకొంది.
మొత్తం మీద చూస్తే ఈ ఎపిసోడ్ మాత్రం కచ్చితంగా ఈ సీజన్లో టాప్ టిఆర్పి రేటింగులు సాధించే విధంగా షో నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా వచ్చిన ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.