AP Government : ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం లో ఇప్పటి వరకు ఉన్న డ్రాయింగ్ ఆఫీసర్ వ్యవస్థలో మార్పులు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.. డ్రాయింగ్ ఆఫీసర్ వ్యవస్థలో మార్పులకు ఏపీ సర్కార్ కసరత్తు చేసింది.. ఏపీలో గ్రామ సచివాలయాలు – పంచాయితీల డీడీఓ బాధ్యతల్ని వికేంద్రీకరిస్తూ జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది..
ప్రస్తుతం గ్రామ సచివాలయాలు డిడిఓ గా పంచాయితీ ఈవో వ్యవహరిస్తున్నారు. అయితే పంచాయతీ ఈవో స్థానంలో వీఆర్వో ను డిడిఓ గా నియమించే ప్రతిపాదనపై ఏపీ సర్కార్ దృష్టిసారించింది. పంచాయతీ ఉద్యోగులకు పంచాయతీ ఎగ్జిక్యూటివ్ అధికారి డి.డి.ఒ గా వ్యవహరించనున్నారు. గ్రామ సచివాలయం లోని కార్యదర్శులు అందరికీ డిడిఓ గా వీఆర్వోకు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు మొత్తం డ్రాయింగ్ అండ్ డిస్ బర్స్మెంట్ అధికారి బాధ్యతలు కూడా పంచాయతీ ఎగ్జిక్యూటివ్ అధికారులు నిర్వర్తించారు. ఇకపై పంచాయతీలకు, సచివాలయాలకు వేరువేరుగా డిడీఓ లను నియమించింది. పంచాయతీలకు, సచివాలయాలకు లింక్ అధికారిగా గ్రామపంచాయతీ ఎగ్జిక్యూటివ్ అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.