COVID vaccination: ఒకదాని వెంబడి మరొకటి వస్తున్నా covid వేవ్ లను తట్టుకోవడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ఒకటే ప్రస్తుతం మన ముందున్న మార్గం. దేశవ్యాప్తంగా covid వ్యాక్సినేషన్ ను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సందేహాలు చేస్తుంది. ఇదే క్రమంలో విదేశీ వ్యాక్సిన్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయినప్పటికీ భారతదేశంలో రెండు డోసులు వేసుకున్న వారి సంఖ్య మొత్తం మన దేశ జనాభాలో మూడు శాతం మాత్రమే.
ఇలాంటి పరిస్థితిలో జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి చెందిన ఒక చిన్న గ్రామం మాత్రం నూరుశాతం వ్యాక్సినేషన్ జరుపుకున్న ఊరు గా రికార్డు సృష్టించింది. జమ్ము లోని bandipura జిల్లాకు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేయన్ గ్రామం ఖాతాలోకి ఈ ఘనత వెళ్ళింది. ఈ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకున్నారు. 362 మంది వయోజనులు ఉన్న ఈ గ్రామంలో ఇంటింటికి వెళ్లి వ్యాక్సినేషన్ చేశారు.
నిజానికి చెప్పాలంటే ఈ ఊరికి వెళ్లేందుకు కనీసం రోడ్డు మార్గం కూడా సరిగ్గా లేదు. వాళ్ళని చేరుకోవాలంటే దాదాపు 18 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళవలసి వస్తుంది. ఆరోగ్య శాఖ అధికారులు ఈ ఊరిలోని వారికి వ్యాక్సిన్ ఇవ్వడం చాలా పెద్ద శ్రమ అని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నవారంతా ప్రాచీన తెగలకు చెందిన వారు. ఉదయాన్నే గోవులని తీసుకుని ఎత్తైన కొండల కి వెళుతుంటారు.
ఆ గ్రామానికి ఇంటర్నెట్ కూడా లేదు కాబట్టి ఆన్లైన్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకోలేరు అని మెడికల్ ఆఫీసర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. కానీ జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం రూపొందించిన మోడల్ ప్రకారం వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగింది. దాంతో ఊర్లో ఉన్నవారంతా వ్యాక్సిన్ తీసేసుకున్నారు. ఈ గ్రామం సంగతి పక్కన పెడితే ఆ రాష్ట్రంలో ఉన్న 45 ఏళ్ల వయస్సు దాటిన వారిలో 70 శాతం మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు