Breaking News: నది జలాలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రాజెక్టులు పట్టేస్తుంది అంటూ ఎప్పటినుండో ఏపీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టుల కడుతుంది అంటూ ఆరోపణలు చేస్తూ ఉంది.
పరిస్థితి ఇలా ఉండగా ఇటీవల సచివాలయంలో ఏపీ మంత్రి మండలి సమావేశం జరిగింది. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి క్యాబినెట్ మంత్రులంతా హాజరయ్యారు. కాగా ఈ సమావేశంలో ఏపీ- తెలంగాణ జల వివాదలపై క్యాబినెట్ చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా క్యాబినెట్ మంత్రులు ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఏ విషయంలోనూ రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇదే తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దూకుడు వ్యవహారాన్ని.. కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతమాత్రమే కాకుండా ఈ విషయంపై ప్రధాని మోడీ కి లెటర్ రాయాలి అని క్యాబినెట్ డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.