Congress Leaders Protest: చమురు, గ్యాస్ ధరల పెరుగుదలపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తోంది. ఢిల్లీలోని విజయ్ చౌక్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలతో పార్లమెంట్ సభ్యులతో కలిసి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. గత పది రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను తొమ్మిది సార్లు పెంచారనీ, పెరుగుతున్న ధరలను అదుపులోకి తీసుకురావాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరల పెరుగుదలపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.
Read More: AP New Districts: కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఫిక్స్..ఉగాది నాడు కాదు..
Congress Leaders Protest: ఇంథన ధరలు పెరుగుతాయని ముందే చెప్పాం
ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నేతలు అధీర్ రంజన్ చౌదదరి, మల్లికార్జున్ ఖర్గే, అభిషేక్ సింఘ్వీ తదితరులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే ఇంథన ధరలు పెరుగుతాయని తాము ముందే చెప్పామని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి అన్నారు. ఇంధనం, ఎల్పీజీ ధరల పెంపునకు వ్యతిరేకంగా రాహుల్ నేతృత్వంలో దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.