AP New Districts: ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటునకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. వచ్చే నెల 4వ తేదీ (ఏప్రిల్) నుండి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభం కానుంది. ముందుగా ఉగాది పర్వదినం రోజున నూతన జిల్లాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే ఈ కార్యక్రమాన్ని రెండు రోజుల వాయిదా వేశారు. కొత్త జిల్లాలను ఏప్రిల్ 4వ తేదీ నుండి ఉదయం 9.05 గంటల నుండి 9.45 గంటల మధ్య ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
AP New Districts: ఏప్రిల్ 4వ తేదీ కొత్త జిల్లాల అవతరణ
కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో నేడు జరిగిన సమీక్షలో ఈ విషయాన్ని సీఎం వైఎస్ జగన్ సమీక్ష వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా 4వ తేదీ కొత్త జిల్లాల ఏర్పాటు కాబోతున్నాయి. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుండి 1100లకు పైగా అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో కొన్ని మార్పులు చేర్పులు చోటుచేసుకోనున్నాయి. మార్పులు చేరులతో ఈలోపుగా తుది నోటిపికేషన్ విడుదల చేస్తారు. కాగా కొత్త జిల్లాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 26 జిల్లాల ఏర్పాటునకు గానూ వర్చువల్ గా ఆమోదం తెలిపింది కేబినెట్. కొత్తగా 13 జిల్లాలతో పాటు 21 రెవెన్యూ డివిజన్ లు ఏర్పాటు చేశారు.
ఏప్రిల్ 6న వాలంటీర్ల సేవలకు సత్కారం
ఏప్రిల్ 6వ తేదీన వాలంటీర్ల సేవలకు సత్కార కార్యక్రమం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 8న వసతి దీవెన కార్యక్రమం నిర్వహిస్తారు. కొత్త జిల్లాల ఆవిర్భావం, వాలంటీర్ల సత్కారం, వసతి దీవెన కార్యక్రమాలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ కే వి రాజేంద్రనాథ్ రెడ్డి, సీసీఎల్ఏ స్పెషల్ సీఎస్ జి సాయి ప్రసాద్, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ప్లానింగ్ సెక్రటరీ జి విజయకుమార్, ఐటీ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, లా సెక్రటరీ వి సునీత ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.