NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ స్టార్ హీరోలందరూ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్ట్రైట్ సినిమాలు చేసేందుకు గట్టి ప్రయత్నాలలో ఉన్నారు. ఇప్పటికే అక్కడ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ను చేస్తున్నాడు. ఇది ప్రభాస్ బాలీవుడ్ ఫస్ట్ స్ట్రైట్ సినిమా. ఈ రూట్లోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా వెళుతున్నాడు. గత ఏడాది చివరిలో అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 1 మూవీతో హిందీలో భారీ హిట్ అందుకున్నాడు. రూ 100 కోట్లు వసూళ్లు రాబట్టడంతో హిందీ బెల్ట్లో బన్నీకి ఉన్న క్రేజ్ ఏంటో అర్థమైంది.
అందుకే, ఇప్పుడు అల్లు అర్జున్ తెలుగుతో పాటుగా హిందీలో ఓ భారీ బడ్జెట్ స్ట్రైట్ సినిమాను చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ కారణంగానే ఇటీవల బన్నీ ముంబై వెళ్ళి అగ్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో చర్చలు జరిపి వచ్చాడు. త్వరలో వీరి కాంబినేషన్లో ఓ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా నటించిన భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. హిందీలో కూడా ఈ సినిమా రూ 100 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టింది.
NTR: రాజ్ కుమార్ హిరాణితో సినిమా చేసేందుకు ప్లాన్స్..!
దాంతో చరణ్, తారక్లకు బాలీవుడ్లో భారీ స్థాయిలో క్రేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే తారక్ హిందీలో ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అక్కడ స్టార్ డైరెక్టర్ అయిన రాజ్ కుమార్ హిరాణితో సినిమా చేసేందుకు ప్లాన్స్ వేస్తున్నట్టు తాజా సమచారం. ఇటీవల తారక్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హిందీలో గనక సినిమా చేస్తే ముందుగా రాజ్ కుమార్ హిరాణితో చేస్తానని చెప్పుకొచ్చాడు. దాంతో ఇన్డైరెక్ట్గా ఎన్టీఆర్ బాలీవుడ్లో స్ట్రైట్ సినిమా అప్డేట్ ఇచ్చినట్టే అని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో.