YS Viveka Case: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు ఆదేశాలపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవీ చంద్రచూడ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గంగిరెడ్డి డీఫాల్ట్ బెయిల్ రద్దు చేస్తూ గత నెల 27వ తేదీన తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జూన్ 30లోగా దర్యాప్తు ను పూర్తి చేయాలని సుప్రీం కోర్టు గడువు విధించిన నేపథ్యంలో జూలై న గంగిరెడ్డిని బెయిల్ పై విడుదల చేయాలని హైకోర్టు ఉత్తర్వులో పేర్కొంది.
ఇలా షరతులతో కూడిన బెయిల్ రద్దు చేయడంపై వివేకా కుమార్తె సునీత రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బెయిల్ రద్దు చేసి మళ్లీ ఫలానా రోజున విడుదల చేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను పరిశీలించిన సీజే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది విచారణను వెకేషన్ బెంచ్ కి బదిలీ చేసింది. ఈ పిటిషన్ ను సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్ వచ్చే వారం విచారణ జరపనుంది.
వివేకా హత్య కేసుకు సంబంధించి వివిధ స్థాయిల్లోని న్యాయస్థానాల్లో పెద్ద యుద్దమే జరుగుతోంది. ఓ పక్క వివేకా కుమార్తె, మరో పక్క సీబీఐ, నిందితులు .. సీబీఐ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయిస్తూ ప్రతి దశలోనూ న్యాయపోరాటాన్ని చేస్తూనే ఉన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపి అవినాష్ రెడ్డి కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పై సీబీఐ తొలుత ఏపీ హైకోర్టు, ఆ తర్వాత సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
AP Govt: ఏపిలో టెన్త్ టాపర్ లకు సీఎం జగన్ గుడ్ న్యూస్