Nellore: మాజీ మంత్రి, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, ఆయన బాబాయ్ మున్సిపల్ కార్పోరేషన్ వైస్ చైర్మన్ రూప్ కుమార్ యాదవ్ మధ్య విభేదాల నేపథ్యంలో నెల్లూరు వైసీపీ రాజకీయం హాట్ హాట్ గా మారింది. వీరి మధ్య సీఎం వైఎస్ జగన్ రాజీ చేసినా అనిల్ కుమార్ యాదవ్ మెత్తబడలేదు. ఇటీవలే సంచలన కామెంట్స్ చేశారు. అవసరమైతే రాజకీయాల నుండి తప్పుకుంటాను కానీ ఆతనితో కలిసి పని చేయను అని తెగేసి చెప్పారు. ఈ తరుణంలో అనిల్ కుమార్ యాదవ్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అనిల్ కుమార్ యాదవ్.
ఎవరో కొంత మంది ఫేక్ గాళ్లు.. ఫేక్ వార్తలతో అసత్య ప్రచారాలకు దిగినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదని అన్నారు. తన పేరును వాడుకుని మీరు డబ్బులు సంపాదించుకుంటూ సుఖంగా ఉంటారంటే దాన్ని కూడా స్వాగతించే వ్యక్తిని తాను అంటూ చెప్పుకొచ్చారు. మా తండ్రి వర్ధంతి నాడు మా తండ్ర సాక్షిగా చెప్తున్నా.. రాజకీయాల్లో ఉన్నంత వరకూ జగనన్న తోనే నా పయనం. జగన్మోహనరెడ్డి నన్ను తరిమేసే పరిస్థితి రాదు. ఒక వేళ వచ్చినా .. తుది శ్వాస వరకు జగనన్నకోసమే పని చేస్తా. పేరుపొందిన గొర్రెలతో కలిసి గొర్రెగా ఉండే కంటే.. ఒంటరిగా సింహంలా ఉండటం మంచిది అనే సామెతను బాగా విశ్వసిస్తా. మోకాలి సమస్య కారణంగా చికిత్స కోసం 15 రోజుల పాటు నగరానికి దూరంగా ఉండబోతున్నాను అని చెప్పారు. అందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విరామం ఇస్తున్నట్లు తెలిపారు.
మీడియా దాన్ని వక్రీకరించి అనిల్ జగన్ కు దూరం అవుతునాడు. అనిల్ పని అయిపోయింది. అందుకే కనిపించడం లేదు అంటూ తప్పుడు వార్తలు పెట్టకండి అంటూ విజ్ఞప్తి చేశారు. 15 రోజుల తర్వాత జరిగే సమావేశాలలో తన చికిత్సకు సంబంధించిన ఆధారాలను మీడియాకు చూపించేందుకు కూడా సిద్దమేనని అన్నారు. అన్ని విషయాల్లో కోపం, ఆవేశం ప్రదర్శించినా ఒక్క జగన్ విషయంలో మాత్రం ఓపికగా ఉంటానని అన్నారు. జగన్ గెటవుట్, గెట్ లాస్ట్ అని అన్నా నేను మాత్రం ఫాలోయర్ గానే ఉంటానని అనిల్ కుమార్ యాదవ్ చెప్పుకొచ్చారు.
YS Viveka Case: బెయిల్ రద్దులో విడుదల ఉత్తర్వులు .. ఇదేమిటి ..? సుప్రీం కోర్టు సీజే ఆశ్చర్యం..!