మాజీ కాంగ్రెస్ నేతలు తిరిగి పార్టీలోకి రావాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కేసిఆర్ కు వ్యతిరేకంగా అందరం ఏకం కావాలన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసిఆర్ పై ధ్వజమెత్తారు. తెలంగాణలో కేసిఆర్ కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని రేవంత్ పిలుపు నిచ్చారు. బీజేపీలోని ఈటల రాజేందర్ వంటి ఉద్యమకారులే కాదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివేక్, కొండా విశ్వశ్వరరెడ్డి వంటి వారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని అహ్వానం పలికారు.
కాంగ్రెస్ పార్టీ అమ్మవంటిదని ఎవరైనా పార్టీలోకి రావచ్చని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీని వీడిన వారు పార్టీలోకి తిరిగి రావాలని కోరారు. తనను తిట్టినా పట్టించుకోననీ, తన వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటే సీనియర్ నేతలతో మాట్లాడవచ్చని అన్నారు. క్షణికావేశంలో నిర్ణయం తీసుకుని వెళ్లిపోయినవారు వెనక్కి రావాలని ఆయన సూచించారు. అవసరమైతే తాను ఒక మెట్టు దిగుతానని, తెలంగాణ అభ్యున్నతి కోసం కలిసి పని చేద్దామన్నారు రేవంత్ రెడ్డి.
Nellore: గెటవుట్, గెట్ లాస్ట్ అన్నా జగన్ ఫాలోయర్ గానే ఉంటా..మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్