YSRCP: 2024 లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని కట్టడి చేయడానికి విపక్షాలు ఐక్యంగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే రెండు పర్యాయాలు ప్రతిపక్షాలు భేటీ అయ్యాయి. అందులో భాగంగా నేడు, రేపు బెంగళూరులో మరో సారి సమావేశం కావాలని విపక్ష పార్టీలు నిర్ణయించాయి. సోమ, మంగళవారాల్లో కాంగ్రెస్ సహా 24 ప్రతిపక్ష పార్టీలు బెంగళూరులో సమావేశం అవుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అధినేత్ర సోనియా గాంధీ ఆధ్వర్యంలో జరిగే భేటీలో రాబోయే లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించనున్నారు.
బీహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సీఎంలు నితీష్ కుమార్, స్టాలిన్, మమతా బెనర్జీ కూడా సమావేశంలో పాల్గొననున్నారు. 2024 ఎన్నికల్లో గెలుపునకు విపక్షాలు ఏకం కావడంతో బీజేపీ కూడా తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ క్రమంలో ఎన్డీఏ పక్ష కీలక భేటీకి నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో 18వ తేదీన ఢిల్లీలో ఎన్డీఏ కీలక సమావేశానికి 30 పార్టీలకు అహ్వానాలు పంపింది. ఎన్డీఏ పక్ష సమావేశానికి ఏపి నుండి జనసేన పార్టీకి అహ్వానం అందింది. ఎన్డీఏలో చేరాలని టీడీపీ తహతహలాడుతున్నా ఆహ్వానం అందలేదని తెలుస్తొంది. తెలంగాణ, ఏపీలోని ఏ ఇతర పార్టీలకు అటు కాంగ్రెస్ నుండి ఇటు ఎన్డీఏ నుండి అహ్వానాలు అందలేదు.
ఈ తరుణంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. 30 పార్టీలతో ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం జరుగనుండగా, 24 విపక్ష పార్టీలు బెంగళూరులో సమావేశమవుతున్నాయన్నారు. అయితే 2024 ఎన్నికల తర్వాత ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటునకు వైఎస్ఆర్ సీపీ మద్దతుతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఏపీలో ప్రజల ఆశీర్వాదాలు, ప్రజాదరణ వైఎస్ఆర్ సీపీకే ఉన్నాయన్నారు. జాతీయ మీడియా సహా అన్ని సర్వేలు ఏపిలో వైఎస్ఆర్ సీపీ ఘన విజయం సాధిస్తాయని అంచనా వేశాయన్నారు. ఇటీవల ఓ జాతీయ సంస్థ నిర్వహించిన సర్వే రిపోర్టులో 25కి 24 పార్లమెంట్ స్థానాలు వైసీపీ కైవశం చేసుకుంటుందని తెలిపింది. జాతీయ స్థాయిలో మూడవ అతి పెద్ద పార్టీగా వైసీపీ అవతరించనున్నదని చెప్పింది. ఈ స్థాయిలో పార్లమెంట్ స్థానాలు వైసీపీకి వస్తాయన్న అంచనాతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటునకు వైసీపీనే కీలక భూమిక పోషించనున్నదన్నట్లుగా విజయసాయి ట్వీట్ చేశారు.
YSRCP: హాట్ హాట్ గా మారిన రామచంద్రాపురం వైసీపీ రాజకీయం .. చెల్లుబోయిన వర్సెస్ పిల్లి