కడప: వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి శుక్రవారం ఇడుపులపాయలోని దివంగత ముఖ్యమంత్రి సమాధి వైఎస్ఆర్ ఘాట్ను సందర్శించి నివాళులర్పించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా కడప జిల్లా పులివెందులకు చేరుకున్నజగన్మోహనరెడ్డి నిన్న, మొన్న ప్రజాదర్భార్ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వినతి పత్రాలు స్వీకరించారు. నిన్న రాత్రి అమీన్ పూర్ దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మత పెద్దలకు చాదర్ సమర్పించారు. అనంతరం దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా హుస్సేనీతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.
వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాదుకు బయలుదేరారు.
ఈ కార్యక్రమాల్లో వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.