YS Sharmila: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల ఇవేళ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ప్రారంభించిన వైఎస్ఆర్ టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. దీంతో షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడతారని పుకార్లు షికారు చేస్తున్నాయి. షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడితే వైసీపీలోని అసంతృప్తి ఎమ్మెల్యేలు షర్మిల వెంట నడుస్తారని, దీని వల్ల వైసీపీ కి నష్టం అని కొందరు విశ్లేషిస్తున్నారు. మరో పక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక వల్ల అధికార వైసీపీకే లాభమని మరి కొందరు విశ్లేషిస్తున్నారు.
ఇదిలా ఉంటే షర్మిల కాంగ్రెస్ లో చేరికపై సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఏ పార్టీలో చేరినా తమకు (వైసీపీ)కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని వైవీ అన్నారు. ఏపీ ప్రజలు మళ్లీ జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఎవరు కలిసినా, కుటములుగా వచ్చిన తమకు భయం లేదని స్పష్టం చేశారు. తమకు దేవుడి, ప్రజల ఆశీస్సులు ఉన్నాయని, మళ్లీ జగన్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. తాను వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడనని అన్నారు. వైసీపీలో ఇన్ చార్జిల మార్పు అంశంపై మాట్లాడుతూ పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్ర్పారు. మార్పులు, చేర్పులు కొంత మందికి నచ్చకపోవచ్చని అన్నారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ .. కుటుంబాల్లో చిచ్చు పెట్టడం, చీల్చడం టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నైజమని విమర్శించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ సీఎం కాలేడని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉన్నా ప్రత్యర్ధిగానే చూస్తామని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మళ్లీ సీఎం అవుతానని పగటి కలలు కంటున్నారని అన్నారు. ప్రజలు జగన్ ను మరో సారి సీఎం చేయడానికి సిద్దంగా ఉన్నారని చెప్పారు. రాజకీయాల్లో మార్పులు చేర్పులు సహజమని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ వంటి పార్టీలు ఎన్ని వచ్చినా తమ నాయకుడు, ముఖ్యమంత్రి జగన్ వెంటే నడుస్తామని అన్నారు.
MLC Election: తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల