health: ప్రస్తుత కాలంలో తినే ఆహారం మూలంగా ఎసిడిటీ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. మసాలా తో తయారుచేసిన వంటకాలను ఎక్కువ తినడమే ఇందుకు కారణం. ప్రస్తుత కాలంలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వచ్చే సమస్య ఎసిడిటీ. ఇక కొన్ని ఆహారాలు తిని ఈ ఎసిడిటీని తొలగించవచ్చు. మరి ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. అరటిపండు:
అరటి పండులో ఉండే పోషకాలు కారణంగా ఎసిడిటీని తొలగించి జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది.
2. దోసకాయ:
శరీరం నుంచి ఎసిడిటీని తొలగించడంలో దోసకాయ పనిచేస్తుంది. దోసకాయలో ఉండే వాటర్ కంటెంట్ మూలంగా కూడా అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.
3. సబ్జా గింజలు:
శరీరాన్ని డిహైడ్రేట్ చేసి ఉష్ణోగ్రతల నుంచి కాపాడే సబ్జా గింజలు ద్వారా కూడా చెక్ పెట్టవచ్చు.
4. పాస్తా:
పాస్తా తేలిగ్గా ఉండే ఆహారం కనుక దీనిని తీసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగుపడి ఎసిడిటీ దూరమవుతుంది.
5. దుంపలు:
చిలకడ దుంపలను ఉడికించుకుని తినడం ద్వారా కూడా ఎసిడిటీ తొలగిపోయి అనేక పోషకాలు మన శరీరానికి అందుతాయి.
పైన చెప్పిన ఐదు ఆహారాలను క్రమం తప్పకుండా పాటించి ఎసిడిటీని తరిమి కొట్టండి.