Ravi Teja: తెలుగు సినిమా రంగంలో ఒకపక్క సినిమాలు చేస్తూ మరోపక్క వ్యాపారాలు చేసే హీరోలు చాలామంది ఉన్నారు. ఈ రకంగా చేతినిండా డబ్బులు సంపాదిస్తూ సక్సెస్ ఫుల్ కెరియర్ తో దూసుకుపోతూ ఉంటారు. చలనచిత్ర పరిశ్రమలో ఈ రకంగా ప్రారంభంలో నాగార్జున తర్వాత ప్రస్తుత తరంలో హీరో రానా సినిమాలు చేస్తూ వ్యాపారంలో సక్సెస్ సాధించారు. ఇదే రకంగా మల్టీప్లెక్స్ వ్యాపార రంగంలో కూడా చాలామంది స్టార్ హీరోలు అడుగుపెట్టడం జరిగింది. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మొదట అడుగుపెట్టారు. ఏషియన్ సంస్థతో కలిసి AMB అనే మల్టీప్లెక్స్ థియేటర్ రన్ చేస్తున్నారు. ఇక అదే విధంగా విజయ్ దేవరకొండ కూడా మల్టీప్లెక్స్ థియేటర్ రన్ చేస్తూ ఉన్నారు.
అల్లు అర్జున్ కూడా ఇదే రీతిలో మల్టీప్లెక్స్ థియేటర్ వ్యాపారంలో గత ఏడాది అడుగుపెట్టడం జరిగింది. కాగా ఇప్పుడు అదే ఏషియన్ సంస్థతో కలిసి మాస్ మహారాజ రవితేజ మల్టీప్లెక్స్ థియేటర్ వ్యాపారంలో అడుగుపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ లోని దిల్ షుక్ నగర్ లో ART పేరుతో మల్టీప్లెక్స్ నిర్మించబోతున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వరుస పరాజయాలతో ఉన్న రవితేజ ఇటీవల ఈగల్ సినిమాతో అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. కమర్షియల్ మాస్ యాక్షన్ తరహాలో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా ఈ సినిమాలో రవితేజ మేకోవర్ చాలా కొత్తగా ఉండటంతో ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు.
ప్రస్తుతం దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో “మిస్టర్ బచ్చన్” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పీపుల్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రవితేజ పూర్తిగా డిఫరెంట్ లుక్లో కనిపించనున్న ఈ సినిమా ట్యాగ్లైన్ ‘నామ్ తో సునా హోగా’. ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈగల్ తర్వాత రవితేజ నుంచి రాబోతున్న సినిమా ఇదే.