Telugu Doctor: ఆస్ట్రేలియాలో స్నేహితులతో కలిసి సరదాగా విహారం కోసం వెళ్లిన తెలుగు వైద్యురాలు ప్రమాదవశాత్తు లోయలో జారిపడి మృతి చెందింది. ఈ ఘటన కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఎలుకపాడు గ్రామానికి చెందిన మూల్పురు రమేష్ కూతురు మైథిలి, వేమూరు వెంకటేశ్వరరావు దంపతులు గత కొన్నాళ్లుగా ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. వీరి కుమార్తె వేమూరు ఉజ్వల ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్ లో గల బాండ్ యూనివర్శిటీలో మెడిసిన్ పూర్తి చేశారు. రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ ఆసుపత్రిలో పని చేస్తున్నారు.
మెడిసిన్ పూర్తి చెసిన ఉజ్వల ఇటీవల పీజే సీటు కూడా సంపాదించారు. పీజీ చేసి లైఫ్ లో సెటిల్ అవుదామని అనుకున్న సమయంలో విషాదం నెలకొంది. ఈ నెల 2న ఉజ్వల తన స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ కు వెళ్లింది. ప్రమాదవశాత్తు కాలు జారి ఉజ్వల లోయలో జారి పడింది. ఆ ప్రమాదంతో ఉజ్వల మృతి చెందారు.
ఉజ్వల భౌతికకాయాన్ని శనివారం (9వ తేదీ) అమ్మమ్మ స్వగ్రామమైన ఎలుకపాడు తీసుకొస్తున్నారు. ఇక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ ఘటనతో ఎలుకపాడులో విషాదశ్చాయలు అలుముకున్నాయి.
YSRCP: మరో రెండు లోక్ సభ, ఒక అసెంబ్లీ స్థానానికి అభ్యర్ధులను ప్రకటించిన వైసీపీ