YSRCP: వైసీపీ 11వ జాబితాను విడుదల చేసింది. రెండు లోక్ సభ, ఒక అసెంబ్లీ స్థానానికి ఇన్ చార్జిలను ప్రకటిస్తూ శుక్రవారం హైకమాండ్ ఒక ప్రకటన విడుదల చేసింది. కర్నూలు లోక్ సభ స్థానానికి ఇంతకు ముందు మంత్రి గుమ్మనూరు జయరాంను ప్రకటించగా, ఇటీవల ఆయన టీడీపీలో చేరారు. దీంతో కర్నూలు లోక్ సభ స్థానానికి సమన్వయకర్తగా బీవై రామయ్యను పార్టీ నియమించింది.
అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ చార్జిగా రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను పార్టీ నియమించింది. అలానే రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు ను పార్టీ నియమించింది. తాజా జాబితాలో ఇప్పటి వరకూ 75 అసెంబ్లీ స్థానాలకు, 23 లోక్ సభ స్థానాలకు వైసీపీ ఇన్ చార్జిలను ప్రకటించినట్లు అయ్యింది.
రాపాక వరప్రసాద్ గత ఎన్నికల్లో జనసేన నుండి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వైసీపీలో చేరారు. నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జిగా ఉన్నారు. మరల రాజోలు నుండే పోటీ చేయాలని రాపాక వరప్రసాద్ ఆశించినప్పటికీ ఇటీవల టీడీపీ నుండి వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావుకు టికెట్ ఇవ్వాలని సీఎం జగన్ భావించారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వరప్రసాద్ ను అమలాపురం లోక్ సభ ఇన్ చార్జిగా అవకాశం కల్పించారు. దీంతో పార్టీ మారి వచ్చిన ఇద్దరు నేతలకు సీఎం జగన్ న్యాయం చేసినట్లు అయ్యింది.
Congress: 39 మంది అభ్యర్ధులతో తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ .. తెలంగాణలో అభ్యర్థులు వీరే ..