Trinayani April 18 2024 Episode 1216: అరవకండి హాసిని వస్తుంది అని తిలోత్తమ అంటుంది.ఆ సౌండ్ విని హాసిని లేచి బయటికి వస్తుంది. పూల కుండీ కింద పడిపోయింది ఎవరూ లేరు ఏదో గాలికి పడి ఉంటుంది అని హాసిని పూల కుండీని లేపి నిలబెడుతుంది.పూల కుండీ నిలబెట్టిన తర్వాత విశాలాక్షి దగ్గరికి వచ్చి ఇంత జరుగుతున్న విశాలాక్షి గాడ నిద్రలో ఉంది పాపం ఎద్దులయ్య డమ్మక్క బయట పడుకున్నారు విశాలాక్షి మాత్రం వాతావరణం కి సంబంధం లేకుండా హాయిగా నిద్రపోయింది అంటూ తన మెడలో ఉన్న వజ్రాల మంగళసూత్రాలను పట్టుకొని చూసి ఇవి పెళ్లి కాకముందే నువ్వు వేసుకున్నావ్ పెళ్లయిన తర్వాత భర్తను ఎంత ప్రేమగా చూసుకుంటావో అంత బాగా చూసుకో అంటూ వెళ్ళిపోతుంది హాసిని. హాసిని వెళ్లిపోయిందని తిలోత్తమ వచ్చి విశాలాక్షి మెడలో ఉన్న మంగళసూత్రాన్ని కట్ చేసి తన మెడలో వేసుకుంటుంది.
ఒక్కసారిగా కరెంటు పోయి ఆ చీకట్లో విశాలాక్షి పోచమ్మ రూపంలో దర్శనమిచ్చి ఒళ్లంతా కళ్ళతో మంటలతో తిలోత్తమకి కనపడి భయ పెట్టి తన ఒళ్లంతా మసిని చేసేస్తుంది .మమ్మీ ఎక్కడున్నావు త్వరగా వచ్చెయ్ ఎవరైనా వస్తే బాగోదు అని వల్లభ అంటూ ఉంటాడు. ఇంతలో అందరూ గబాల్న లేచి కిందికి వచ్చేస్తారు. ఇంతలో కరెంట్ కూడా వస్తుంది. విశాలాక్షి అలాగే నిద్రపోయి ఉంటుంది. కరెంట్ వచ్చిసరికి తిలోత్తమ ఒళ్లంతా నల్లగా అయిపోయి భయంకరంగా నల్ల పోచమ్మ రూపంలో ఉంటుంది. ఏంటి అత్తయ్య ఒళ్లంతా నల్లగా మారిపోయింది అని నైని అంటుంది. విశాలాక్షి మెడలో ఉండవలసిన మంగళ సూత్రాలు నీ మెడలో ఉన్నాయి ఏంటి అని హాసిని అంటుంది. వజ్రాల మంగళసూత్రం నా మెడలో వేసుకొని చూసుకుందాం అనుకున్నాను కానీ ఇలా మారిపోయాను అని తిలోత్తమ అంటుంది.
మమ్మీ నిన్ను చూస్తే భయం వేస్తుంది ఎందుకిలా అయిపోయావ్ అని వల్లభ అంటాడు. అమ్మ ఎందుకిలా చేశావు అని విశాల్ అంటాడు. ఇది మీ అమ్మ చేయించింది కదా విశాల్ నేను మీ అమ్మకు సవితిని అవుతాను కదా నాది అనుకొని వేసుకున్నాను అని తిలోత్తమ అంటుంది. సవితి అని నువ్వు అనుకుంటే సరిపోదు గాయత్రి అమ్మగారు కూడా అనుకోవాలి అని నైని అంటుంది. చాలా పెద్ద పొరపాటు చేసావ్ అమ్మ అలా చేయకుండా ఉండాల్సింది అని విశాల్ అంటాడు. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది నేను మామూలుగా ఎలా మారుతాను చెప్పండి అని తిలోత్తమ అంటుంది. ఏముంది విశాలాక్షి మంగళసూత్రం కాబట్టి తనకు క్షమాపణ చెప్పండి అని నైని అంటుంది. తిలోత్తమ మంగళసూత్రాలు తీసి విశాలాక్షి చేతులో పెట్టి క్షమించమని అడుగుతుంది. క్షమించమంటే సరిపోదు చెంప దెబ్బ కూడా తినాలి అని విశాలాక్షి అంటుంది. ఎవరు కొడతారు తనని నువ్వు కొడతావా అని వల్లభ అంటాడు. ఆ వస్తువు ఎవరిదో వారికి అధికారం ఉంటుంది గాయత్రీ పాప తిలోత్తమ చెంప మీద కొడితే తన ఒళ్లంతా మామూలుగా మారిపోతుంది అని విశాలాక్షి అంటుంది. ఏంటి అనాధ పిల్ల మా అమ్మని కొడుతుందా అని వల్లభ అంటాడు. తప్పదు మరి మామూలుగా మారాలంటే పడాలి అని నైని అంటుంది.
ఇది మాత్రం అన్యాయం అనాధ పిల్ల కొడితే తిలోత్తమ అత్తయ్య మామూలుగా ఎలా మారుతుంది అని సుమన అంటుంది. చూస్తారుగా మీరే అని విశాలాక్షి విశాల్ దగ్గర ఉన్న గాయత్రి పాపని ఎత్తుకొని తిలోత్తమ చెంప మీద లాగిపెట్టి ఒకటి ఇస్తుంది. ఆఖరికి మా అమ్మని ఆ పిల్ల చేత కొట్టిస్తారా అని వల్లభ అంటాడు. మీ అమ్మని తీసుకువెళ్లి మొహం కడిగించు అని విశాలాక్షి అంటుంది. కట్ చేస్తే, తిలోత్తమ వల్లభ అఖండ స్వామి దగ్గరికి వస్తారు. ఏమైంది తిలోత్తమ అని గురువుగారు అడుగుతారు. గాయత్రీ అక్క అమ్మవారికి చేయించిన వజ్రాల మంగళ సూత్రాలు విశాలాక్షి ఏసుకొచ్చింది అవి నా మెడలో వేసుకుంటే ఎలా ఉంటుందో చూసుకుందామని వేసుకున్నాను గురువుగారు కానీ నేను నల్లగా మారిపోయాను విశాలాక్షి కూడా నల్లగా కనపడి నన్ను భయపెట్టింది కానీ గాయత్రి పాప కొట్టడంతో నేను మామూలుగా అయిపోయాను అది ఎలా సాధ్యమైంది స్వామి అని తిలోత్తమ అంటుంది. ఒక్కసారి అమ్మవారికి చేయించిన మంగళ సూత్రాలు మానవులు మాత్రం వేసుకోకూడదు అని తెలియదా తిలోత్తమ అని అఖండ స్వామి అంటాడు.
మరి ఆ విశాలాక్షి పాప ఏసుకుంది తనకేం కాలేదు కదా గురువుగారు అని వల్లభ అంటాడు. తను గారడీ పిల్ల కాబట్టి ఏదో మాయ చేసి ఉంటుంది అందుకే తనకేమీ కాలేదు అని తిలోత్తమ అంటుంది. తను విశాలాక్షి కాబట్టి అందుకే ఏమీ కాలేదు అని అఖండ స్వామి అంటాడు. స్వామి రేపు నైని తడి బట్టలతో గుడికి వెళ్ళమని విశాలాక్షి చెప్తుండగా విన్నాను మీరు ఒక చిన్న సహాయం చేయాలి గురువుగారు అని తిలోత్తమ అంటుంది. ఏంటి అని గురువుగారు అంటారు. ఏమీ లేదు స్వామి నీళ్లలో మంట వచ్చే ఏదైనా మూలిక ఉంటే ఇవ్వండి అని తిలోత్తమ అడుగుతుంది. ఎందుకు తిలోత్తమ అని అఖండ స్వామి అంటారు.
మా మమ్మీ దూరంగా ఆలోచిస్తుంది పని అయ్యాక చెప్తుందిలే స్వామి అని వల్లభ అనడంతో అఖండ స్వామి మూలికను తెచ్చి ఇది నీటి మీద కూడా మంట వస్తుంది దీన్ని జాగ్రత్తగా వాడండి లేదంటే ప్రమాదం కొని తెచ్చుకుంటారు అని అఖండ స్వామి చెబుతాడు. అలాగే అంటూ తిలోత్తమ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, హాసిని ఒక ప్లేట్లో బియ్యం పోసి పూజకు సిద్ధం చేస్తూ ఉంటుంది. పెద్దమ్మ 9 ఉసిరికాయలు బియ్యం మీద పెట్టు అని విశాలాక్షి చెబుతుంది. మంచిగా పెట్టవే లేదంటే అపచారం జరుగుతుంది అని దురంధర అంటుంది. విశాలాక్షి ఇలాగేనా పెట్టేది అని హాసిని అడుగుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది