పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ చిత్రం తర్వాత దేశవ్యాప్తంగా ఎనలేని క్రేజ్ సంపాదించాడు. బాహుబలి తర్వాత విడుదలైన ‘సాహో’ చిత్రం టాలీవుడ్ లో పెద్దగా ఆడకపోయినా.. బాలీవుడ్ లో మాత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇదిలా ఉండగా ప్రభాస్ తదుపరి చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రస్తుత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది.
అయితే ఈ చిత్రం కంప్లీట్ లవ్ స్టోరీ అన్న విషయం ముందు నుండి తెలిసిందే. ఇకపోతే మొదటి నుండి ఈ చిత్రం యొక్క షూటింగ్ ‘జాన్’ అనే టైటిల్ మీద నడుస్తోంది అని వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమా టైటిల్ అదే అని కూడా అంత ఫిక్స్ అయిపోయారు. అయితే ఒక్క సారిగా ఈ సినిమా టైటిల్ ను వేరేగా మార్చినట్లు వార్తలు గుప్పుమన్నాయి.
ప్రస్తుతం ఇంటర్నెట్ లో ‘రాధేశ్యామ్’ (#RadheShyam) అనే టైటిల్ జోరుగా ట్రెండ్ అవుతోంది. సినిమాకు ఈ టైటిల్ ను చిత్రబృందం ఖరారు చేసినట్లు కూడా వార్తలు వచ్చేశాయి. ఇక కృష్ణంరాజు సమర్పిస్తున్న ప్రభాస్ ఒక్క 20వ చిత్రాన్ని గోపీకృష్ణ మూవీస్ మరియు యు.వి.క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే కొద్ది నెలల క్రితం జార్జిల్యా లో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం యొక్క అప్డేట్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఇప్పటికీ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!