స్టార్ల సినిమాలో హీరో ఒక్కడే కాదు విలన్ కూడా అదే స్థాయిలో ఉంటేనే ఆ సినిమా సూపర్ హిట్టవుతుంది.ఈ మధ్య ఈ ఫార్ములాను టాలీవుడ్ బాగా అనుసరిస్తోంది.విలన్ల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు క్రేజీ మూవీ సర్కారు వారి పాట చిత్ర దర్శకుడు కూడా అదే పని చేశాడు
మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో విలన్ రోల్ కన్ఫర్మ్ చేశారని తెలుస్తోంది. ఆ పాత్ర కోసం పలువురి పేర్లు పరిశీలించిన పిమ్మట చివరకు అరవింద్ స్వామిని ఓకే చేసినట్లు ఫిలిం నగర్ టాక్.
”మహర్షి, సరిలేరు నీకెవ్వరు” లాంటి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించనున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా నుంచి ఇటీవలే టైటిల్ లుక్ రిలీజ్ చేసి అంచనాలను రెట్టింపు చేశారు. అయితే మరికొద్ది రోజుల్లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభించాలని ఫిక్స్ అయిన చిత్రయూనిట్.. నటీనటుల ఎంపిక విషయమై స్పెషల్ కేర్ తీసుకుంటోందట.
ఇటీవలే మహేష్ సరసన నటించే హీరోయిన్గా కీర్తి సురేష్ని ఫైనల్ చేసిన డైరెక్టర్.. ఇక విలన్ రోల్ కోసం పవర్ఫుల్ యాక్టర్ని వెతికేపనిలో పడ్డారు. మహేష్ బాబును ఢీ కొట్టే పాత్ర సినిమాలో కీలక భూమిక పోషించనుంది తెలుస్తోంది. ఈ క్రమంలోనే విలన్ రోల్ కోసం ముందుగా ఉపేంద్ర, సుదీప్ లాంటి నటులను పరిశీలించిన పరశురామ్.. ఫైనల్గా అరవింద్ స్వామి అయితే ఆ పాత్రకు పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు అరవింద్ స్వామితో సంప్రదింపుల కార్యక్రమం నడుస్తోందని సమాచారం.
గతంలో తెలుగు తెరపై రామ్చరణ్ హీరోగా వచ్చిన ‘ధృవ’ విలన్ రోల్ చేసి మెప్పించారు అరవింద్ స్వామి. ఆ పాత్ర తీరుతన్నెలు పరిశీలించిన తర్వాతే పరశురామ్ ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇకపోతే ‘సర్కారు వారి పాట’ స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు షికారు చేస్తున్నాయి. వీటి ప్రకారం బ్యాంకింగ్ రంగంలో కుంభకోణం నేపథ్యంలో ఈ మూవీ రూపొందనుందని తెలుస్తోంది.మహేష్ బాబు అరవింద్ స్వాముల కాంబో అయితే సినిమా అదిరిపోతుందని ప్రిన్స్ అభిమానులు సంబరపడిపోతున్నారు.
previous post