AP Budget: ఏపి అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2021 – 22 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. వరుసగా మూడవ సారి ఆయన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. శాసనమండలిలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. తొలుత బుగ్గన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు జరిగిన మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
- 2021 -22 రాష్ట్ర బడ్జెట్ అంచనా రూ.2,29,779.27 కోట్లు
- బీసీ సబ్ ప్లాన్ కి రూ.28.237 కోట్లు
- కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు
- ఈబీసీ సంక్షేమానికి రూ.5,478 కోట్లు
- బ్రాహ్మణ సంక్షేమానికి రూ.359 కోట్లు
- ఎస్సీ సబ్ ప్లాన్ కు రూ.17,403 కోట్లు
- ఎస్టీ సబ్ ప్లాన్ కు రూ.6,131 కోట్లు
- మైనార్టీ యాక్షన్ ప్లాన్ కు ర.1,756 కోట్లు
- చిన్నారుల కోసం రూ.16,748 కోట్లు
- మహిళల అభివృద్ధికి రూ.47,283.21 కోట్లు
- వ్యవసాయయ పథకాలకు రూ.11,210 కోట్లు
- విద్యా పథకాలకు రూ.13,830 కోట్లు
- వైద్యం, ఆరోగ్యానికి రూ.13,830 కోట్లు
- వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు రూ.17,000 కోట్లు
- వైఎస్ఆర్ రైతు భరోసాకు రూ.3,845 కోట్లు
- జగనన్న విద్యా దీవెనకు రూ.2,500 కోట్లు
- జగనన్న వసతి దీవెన కోసం రూ.2,223 కోట్లు
- వైఎస్ఆర్ – పిఎం ఫసల్ భీమా యోజనకు రూ.1802 కోట్లు
- డ్వాక్రా సంఘాల సున్నా వడ్డీ చెల్లింపులకు రూ.865 కోట్లు
- పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలకు రూ.247 కోట్లు
- రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులకు రూ.500 కోట్లు
- వైఎస్ఆర్ కాపు నేస్తం కోసం రూ.500 కోట్లు
- వైఎస్ఆర్ జగనన్న చేదోడు పథకానికి రూ.300 కోట్లు
- వైఎస్ఆర్ వాహన మిత్ర కోసం రూ.285 కోట్లు
- వైఎస్ఆర్ నేతన్న నేస్తం కోసం రూ.190 కోట్లు
- వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కోసం రూ.120 కోట్లు
- మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ కోసం రూ.50 కోట్లు
- అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపుల కోసం రూ.20కోట్లు
- రైతుకు ఎక్స్ గ్రేషియా కోసం రూ.20కోట్లు
- లా నేస్తం కోసం 16,64 కోట్లు
- ఈబీసీ నేస్తం కోసం రూ.500 కోట్లు
- వైఎస్ఆర్ ఆసరా కోసం రూ.6,337 కోట్లు
- అమ్మఒడి పథకం కోసం రూ.6,107 కోట్లు
- వైఎస్ఆర్ చేయూత కోసం రూ.4,455 కోట్లు
- రైతు పథకాల కోసం రూ.11,210.80 కోట్లు