Ap Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీ మరో సారి వాయిదా పడింది. రేపు ఉదయం సచివాలయంలో 11గంటలకు సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరగాల్సి ఉండగా ఈ సమావేశం మే 4వ తేదీకి వాయిదా పడింది.
ఈ మేరకు సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. తొలుత ఈ నెల 22వ తేదీన కేబినెట్ భేటీ నిర్వహించాలని భావించారు. అయితే ఆ భేటీ 29కి వాయిదా పడింది. ఇప్పుడు మరో సారి వాయిదా వాయిదా వేశారు.