మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు పర్యావరణ రహితంగా ఉండే విద్యుత్ ఆటోలను (ఈ – ఆటోలను) ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వీటి వల్ల మున్సిపాలిటీలకు నిర్వహణ భారం కూడా తగ్గుతుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జెండా ఊపి చెత్త సేకరణ ఈ – ఆటోలను ప్రారంభించారు. రూ.4.10 లక్షల విలువైన ఈ – ఆటోలను మొత్తం రూ.21.18 కోట్ల వ్యయంతో ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటిని 36 మున్సిపాలిటీలకు పంపిణీ చేస్తారు. ఈ ఆటో సామర్థ్యం 500 కిలోలు. మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తూ ఈ – ఆటోల డ్రైవర్లుగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
జగనన్న స్వచ్చ సంకల్పంలో భాగంగా ఇప్పటికే రూ.72 కోట్లతో 123 మున్సిపాలిటీల్లోని 40 లక్షల కుటుంబాలకు తడి, పొడి, హానికర వ్యర్ధాల సేకరణకు నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లోని 120 లక్షల చెత్త బుట్టలను ప్రభుత్వం పంపిణీ చేసింది. గ్రేడ్ – 1 ఆ పై మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు రూ.2,525 పెట్రోల్, డీజిల్, సిఎన్జీ గార్బేజ్ టిప్పర్లను వినియోగిస్తొంది. అలాగే గుంటూరు, విశాఖపట్నంలో వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులు ప్రారంభించింది.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే .. వారికి గుడ్ న్యూస్