మార్గదర్శి ఆర్ధిక స్థితిపై ఏపి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐటీ రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపిలోని పలు చిడ్ ఫండ్స్ సంస్థలపై ఇటీవల అధికారులు తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం ఐజీ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ .. మార్గదర్శలో రికార్డులను సక్రమంగా నిర్వహించడం లేదని అన్నారు. మార్గదర్శిలో ఖాతాదారుల డబ్బుకి భద్రత ఉందా లేదా అనే సందేహాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర విభజన తర్వాత మార్గదర్శి స్టాట్యూటరీ పత్రాలను ఫైల్ చేయలేదని చెప్పారు. ప్రతి చిట్ వివరాలు ఇస్తేనే వాస్తవాలు తెలుస్తాయని పేర్కొన్నారు.
ఒక చిట్ కు సంబంధించి నగదును ఇతర వ్యాపారాలకు మళ్లించకూడదని అన్నారు. మార్గదర్శి నిధులను ఉషోదయ, ఉషాకిరణ్ సంస్థల్లో పెట్టినట్లుగా తెలిపారు. దీంతో మార్గదర్శి ప్రజలను మోసం చేసినట్లుగానే పరిగణించాల్సి ఉంటుందన్నారు. సమాచారం కోసం ప్రశ్నిస్తే వారు సహకరించకపోగా తమ సిబ్బంది దుర్భాషలాడారని తప్పుడు వార్తలు ఇచ్చారన్నారు. చాలా రకాలుగా అక్రమాలకు పాల్పడినందున చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాళ్లకు వారం రోజుల్లో నోటీసులను జారీ చేస్తామని చెప్పారు. మార్గదర్శి అకౌంట్ల నిర్వహణ సక్రమంగా లేనందున వల్ల స్పెషల్ ఆడిట్ చేయాలని ఆదేశాలు ఇచ్చామని ఐజీ రామకృష్ణ తెలిపారు. ఫొరెన్సిక్ ఆడిట్ చేయాలని ఆదేశాలు ఇచ్చామని ఆయన చెప్పారు.
రీసెంట్ గా తెలంగాణ అధికారుల సహకాారంతో హైదరాబాద్ సంస్థల్లో తనిఖీలు చేస్తామని ఐజీ రామకృష్ణ తెలిపారు. తమకు ఏ సంస్థ పైనా ప్రత్యేకంగా వివక్ష ఉండదనీ 2018లో కపిల్ చిట్ ఫండ్ పై చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. 2022 వరకూ కమిల్ చిట్ ఫండ్ కు కొత్త చిట్ కు అనుమతి ఇవ్వలేదని అన్నారు. మార్గదర్శి 2018 లో కూడా బ్యాంక్ స్టెట్ మెంట్ ఇవ్వలేదని ఆయన చెప్పారు.